అన్వేషించండి

Pattabhi Bail : పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !

టీడీపీ నేత పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టులో నిబంధనలు పాటించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిలో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు అయింది. శుక్రవారమే పట్టాభి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పిసి సెక్షన్‌ 41 కింద పోలీసులు ఇచ్చిన నోటీసు అంశంపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ పట్టాభిని రిమాండ్‌కు పంపారు. సిఆర్‌పిసి సెక్షన్‌ 41 ప్రకారం నడుచుకున్నామంటూ పోలీసులు సమర్పించిన పత్రంలో పలు ఖాళీలు ఉండటంపై మెజిస్ట్రేట్‌ అభ్యంతరం చెప్పారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టాభి తరపు న్యాయవాది కోరినప్పటికీ రిమాండ్‌కు పంపారు. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టుపై సంతృప్తి చెందనప్పటికీ ఎలా రిమాండ్‌కు పంపుతారనని.. పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు రికార్డులను పీపీ సమర్పించారు.  

Also Read : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఓపెన్ ఛాలెంజ్... అలా చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం...!

రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని.. అరెస్టులో సరైన విధానాలు పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పట్టాభి దిగారని.. అందుకే విధ్వంసకాండ చోటు చేసుకుందని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే వ్యక్తులను బట్టి అరెస్టులు, పద్దతులు ఉండవని.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని.. ఇక్కడ పోలీసులు ఆలాంటిదేమీ చేయలేదని పట్టాభి తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి పట్టాభికి బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

 Also Read: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం

గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలా నోటీసులు ఇవ్వడంపై పట్టాభి టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారు. అయితే ఆయన బూతులు తిట్టారంటూ సాయంత్రానికి పట్టాభి ఇంటితో పాటు టీడీపీ కార్యాలయంపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేసి విధ్వంసానికి దిగారు. అయితే సీఎంను దూషించడం వల్లే ఇదంతా జరిగిందంటూ పట్టాభినే అరెస్ట్ చేశారు. 

Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

మరో వైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్‌కుమార్, అడపాల గణపతి,  షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభినాయుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్‌ కోసం టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. మరో వైపు పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిలో పదకొండు మందిని గుర్తించి కేసులు పెట్టారు. 

Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Embed widget