అన్వేషించండి

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి "సరైన ప్రతిపక్షం లేకపోవడం" సమస్యగా మారిందా? ఎమ్మెల్యేలు "ఎదురు లేదని" కట్టుతప్పుతున్నారా?

Lack of a proper opposition: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి "సరైన ప్రతిపక్షం లేకపోవడం" సమస్యగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎదిరించేవారు లేరని ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Problems for the coalition government in Andhra Pradesh:  2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీ కూటమి (NDA) 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేవలం 11 సీట్లతో ప్రతిపక్షంగా మిగిలింది.  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ అసెంబ్లీకి రావడం మానేశారు.  ఈ "బలహీన ప్రతిపక్షం" కూటమి ప్రభుత్వానికి "సమస్యగా" మారిన సూచనలు కనిపిస్తున్నాయి.  తమకు "ఎదురు లేదని"   ఎమ్మెల్యేలు  కట్టుతప్పుతున్నారు.  

హోదా లేదని ప్రతిపక్ష పాత్ర పోషించని వైసీపీ 

2024 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది.  అవినీతి ఆరోపణలు, పాలనలో  ఘోరాలు, రైతులు, మహిళలు, యువతలో అసంతృప్తి కారణంగా వైసీపీ ఘోరంగా ఉడిపోయింది.  వైసీపీకి ప్రతిపక్ష హోదాకు  అవకాశం లేకపోవడం  వల్ల.. అసెంబ్లీ రూల్స్ ప్రకారం 10% సీట్లు అవసరం అయినా రాకపోవడం వల్ల "సైలెంట్ ఓపోజిషన్" స్థితిని సృష్టించింది. ప్రతిపక్ష బలహీనత ప్రభుత్వానికి "ఫ్రీ పాస్" ఇస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకపోవడం,  హౌస్ కమిటీల్లో ఉండకపోవ ఫలితంగా, ప్రభుత్వ నిర్ణయాలపై రాజ్యాంగ వేదికపై ప్రశ్నించడం తగ్గిపోయింది. 

 ప్రతిపక్ష బలహీనత - ప్రభుత్వానికి సమస్య 

"సరైన ప్రతిపక్షం లేకపోవడం" కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా సమస్యలు సృష్టిస్తోంది. ఎదురు లేకపోవడం వల్ల ప్రభుత్వం సులభంగా రీఫార్మ్స్ అమలు చేస్తోంది. జనసేన, బీజేపీలు కూటమి భాగస్వాములు కావడం వల్ల అంతర్గత విమర్శలు తక్కువ. కానీ  ప్రతిపక్షం లేకపోవడం "అకౌంటబిలిటీ"ను తగ్గిస్తుంది. వైసీపీ  అసెంబ్లీకి రాకపోవడం పార్లమెంటరీ డెమాక్రసీకి దెబ్బ అనుకోవచ్చు.   బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రభుత్వాన్ని "అబ్యూజ్ ఆఫ్ పవర్"కు ప్రేరేపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

 ఎమ్మెల్యేలు "ఎదురు లేదని" కట్టుతప్పుతున్నారా?  

ప్రతిపక్ష బలహీనత వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు "కట్టుతప్పుతున్నారన్న"ఆరోపణలుపెరిగాయి.   ఎదురు లేకపోవడం వల్ల "చెక్స్ అండ్ బాలెన్సెస్" లేకపోవడం అనైతికతకు దారి తీస్తుంది. ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు "సెల్ఫ్-సర్వింగ్" మోడ్‌లోకి వెళ్లారు.అందుకే ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత మంది ప్రత్యేకంగా దందాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేల తీరుపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే వారిలో ఎంత మంది పట్టించుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న ఇన్ ఫైటింగ్                         
 
ప్రతిపక్షం లేకపోవడం వల్ల "ఇన్‌ఫైటింగ్" పెరిగే అవకాశం కనిపిస్తోంది.  టీడీపీ-జనసేన మధ్య ఇలాంటివి తరచూ కనిపిస్తున్నాయి.  ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ అంశాలపై వేర్వేరు అభిప్రాయాలు సహజమే కానీ.. అవి ప్రతిపక్షం లేకపోవడం వల్ల రావడం సమస్యలు సృష్టిస్తుంది.  ప్రతిపక్షం లేకపోవడం  వల్ల అకౌంటబిలిటీని తగ్గించి, అనైతిక ప్రవర్తనలకు  దారి తీస్తోంది. ఎమ్మెల్యేలు "ఎదురు లేదని" లాభపడుతున్నారనే ఆరోపణలు నిజమవుతున్నాయి. ఇది లాంగ్-టర్మ్‌లో ప్రభుత్వానికి బూమరాంగ్ అవుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget