అన్వేషించండి

Srikakulam : 36 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.1.50 లక్షల వడ్డీ- శ్రీకాకుళంలో ఫైనాన్స్ సంస్థ టెంప్టింగ్ ఆఫర్

Andhra Pradesh: 9 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.37500 వడ్డీ. ఆ డబ్బు కూడా మీ అకౌంట్లో ఉంటుంది. టెంప్టింగా ఉన్న ఈ ఆఫర్‌తోనే సిక్కోలు నడిబొడ్డున మోసం జరిగింది.

Financial Fraud In Srikakulam: మమ్మల్ని విశ్వసించి మీ సొమ్మును జమ చేస్తే రోజువారీ వడ్డీలు ఇస్తాం. దీంతో మీరు తక్కువ కాలంలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్లో మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివిధ ప్లాన్లు, దానికి సంబంధించిన వడ్డీ వివరాలు చూసుకుని అందులో చేరటమే. వేరే వారిని ఇందులో చేర్చినా లాభం ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతూ అధిక వడ్డీలు ఆశ చూపిన ఓ సంస్థ జారీ చేసిన ప్రకటన. వివరాల్లోకి వెళితే..స్థానిక సానావీధి వద్ద ఇండియన్ బ్యాంక్ మేడపైన ఐఏఎస్ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశారు. ఆన్లైన్‌లో ఈ పేరుతో ఓ యాప్ కూడా ఉంది. ఓ వాట్సాప్ ఛానల్‌ కూడా క్రియేట్ చేశారు. 

అప్పలరెడ్డి అనే వ్యక్తి హెడ్‌గా ఉంటున్న ఈ సంస్థ ఐదు జిల్లాల్లో జనాలను బాగా మోటివేట్ చేసింది. జిల్లాలో సుమారు రూ.20 కోట్ల వరకూ వసూలు చేసింది. ప్రజల నుంచి డిపాజిట్‌లు తీసుకొని కొన్నాళ్లుగా వడ్డీలు ఇస్తున్నారు. అనధికారికంగా ఈ లెక్క చాలా ఎక్కువే ఉంటుందని సమాచారం. డిపాజిట్ చేసిన సొమ్ము బట్టి వడ్డీ చెల్లిస్తుంటారు. 

సానావీధి వద్ద సంస్థ కార్యాలయం బోర్డును మూడురోజుల కిందట తిప్పేశారు. రాత్రికి రాత్రే అందులోని సామాన్లంతా తరలించేశారు. ఈ విషయాన్ని సొమ్ము కట్టిన వారు ఆలస్యంగా గుర్తించారు. సంస్థ కార్యాలయం వద్దకు వెళ్ళి సొమ్ములు కట్టిన వారంతా ఆందోళనకు దిగారు.

ప్లాన్లతో ఆకర్షించి..
ఐఏఎస్ సంస్థ వివిధ రకాల ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించి ఇబ్బడిముబ్బడిగా వారి నుంచి సొమ్ములు వసూలు చేసినట్టు తెలిసింది. రూ.2100 జమ చేస్తే రోజుకు రూ.75 వడ్డీ కింద చెల్లిస్తారు. అలాగే రూ.5500 చెల్లిస్తే రోజుకు రూ.200, రూ.18300 చెల్లిస్తే రోజుకు రూ.660, రూ.55 వేలు చెల్లిస్తే రోజుకు రూ.1980, రూ.1.39 లక్షలు చెల్లిస్తే రూ.5350, రూ.3.55 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.13760, రూ.9 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.37500, రూ.18 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.74880, రూ.36 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.1.50 లక్షల వడ్డీ ఇస్తామని ఆశ చూపి పెద్దమొత్తంలో సొమ్ములను వసూలు చేశారు. 

ప్లే స్టోర్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకుని పేటీఎం ద్వారా సొమ్మును చెల్లిస్తే వడ్డీ మరలా అదే యాప్‌లో జమ అవుతుంది. విత్ డ్రా చేసుకునేందుకు రిక్వెస్ట్ పెడితే కొన్నిసార్లు జమ అవడం, మరికొన్నిసార్లు షరతులు పెట్టి ఇంకా కొంత సొమ్ము చెల్లించాలని కోరడం వంటి పరిణామాలు జరుగుతుంటాయి. లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే కావడంతో ఐఏఎస్ యాప్‌కు హెడ్ ఎవరన్నది సొమ్ములు కట్టేవారికి తెలియదు.

అయితే ఇదే విషయంపై కొందరు ప్రశ్నించడంతో నెల క్రితం సానా వీధి మెయిన్ రోడ్డులో కార్యాలయాన్ని తెరిచారు. ఆ ఆఫీస్‌ చూసి మరింత మంది కస్టమర్లు ఇందులో యాడ్ అయ్యారు. టార్గెట్ రీచ్ అయ్యాక మూడో కంటికి తెలియకుండా బోర్డు తిప్పేశారు. సొమ్ములు చెల్లించిన వారు అవి ఎలా వెనక్కి తెచ్చుకోవాలో అర్ధంకాక తలలు బాదుకుంటున్నారు.

కొత్తవారిని చేర్చుకునేందుకు..

ఐఏఎస్ యాప్‌లో కొత్తవారిని ఆకర్షించేందుకు చాలా ప్లాన్‌లు వేశారు. అప్పటికే సొమ్ము చెల్లిస్తూ వడ్డీలు పొందుతున్నవారు ఎవరినైనా రిఫరెన్స్ ఇస్తే కట్టిన సొమ్ములో సుమారు 30 శాతానికిపైగా కమీషన్ల రూపంలో ఇస్తామని చెప్పారు. ఇదే ఆశతో ఇందులో చేరినవారంతా కొత్తవారిని చేర్చడంపై దృష్టి కేంద్రీకరించారు. తద్వారా సంస్థకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. అన్నీ చూసుకుని ఉడాయించేయడంతో సొమ్ములు కట్టినవారు లబోదిబోమంటున్నారు. 

ఈ మోసంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా బాధితులకు అర్ధం కావడంలేదు. ఐఏఎస్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్లో ఇప్పటికీ కొందరు మెసేజ్లు చేస్తూ చెల్లించిన సొమ్ముకు ఎటువంటి డోకా ఉండదని, కొత్తవారిని చేర్చాలని చెబుతుండటం కొసమెరుపు. 

Also Read: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget