అన్వేషించండి

Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం

Pranab Mukherjees Daughter Sharmistha Mukherjee | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి సీడబ్లూసీ సమావేశంలో నివాళులర్పించారు.

Manmohan Singh funeral : న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల సమయంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం చెలరేగింది. తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా గౌరవించలేదని, ఆయన విషయంలో తీరని అన్యాయం చేశారని శర్మిష్ఠా ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు (శనివారం) అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్ వరకు మాజీ ప్రధాని అంతిమయాత్ర జరగనుంది. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ ప్రదేశంలోనే స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ తన తండ్రి విషయంలో కాంగ్రెస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించారని ప్రణబ్ ముఖర్జీ కూతురు ఆరోపించారు.

నా తండ్రిపై ఎందుకీ వివక్ష.. శర్మిష్టా మండిపాటు

మన్మోహన్ విషయంలో చూపిన శ్రద్ధ, ప్రేమ, గౌరవం తన తండ్రి ప్రణబ్‌ ముఖర్జీ (Pranab Mukherjee) ఎందుకు చూపలేదని శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ (CWC) సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ అనంతరం దేశానికి రాష్ట్రపతిగా సేవలు చేసినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి అధికారికంగా నివాళులు ఎందుకు అర్పించలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 

తప్పుదోవ పట్టించారు..
ప్రణబ్‌ ముఖర్జీ 2020లో మరణించారు. ఆ సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించకపోవడంపై శర్మిష్టా ముఖర్జీ పలు విషయాలు లేవనెత్తారు. నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ ఎందుకు నిర్వహించలేదని అడిగితే.. రాష్ట్రపతిగా చేసిన వారికి అలా చేయరని చెప్పి తనను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతులకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి సంతాపం తెలిసేపే ఆ సంప్రదాయం పాటించడం లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని తెలిపారు. కానీ తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందని... గతంలో రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించినట్లు అందులో ఉందన్నారు.

Also Read: Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మెమోరియల్ అనేది గొప్ప నిర్ణయం. అందుకు ఆయన అర్హులు. భారత రత్న రావాలని తన చేతుల మీదుగా ప్రదానం చేయాలని నాన్న అనుకున్నారు. కొన్ని కారణాలతో అలా జరగలేదని ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా ముఖర్జీ మరో ట్వీట్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget