అన్వేషించండి

Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం

Pranab Mukherjees Daughter Sharmistha Mukherjee | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి సీడబ్లూసీ సమావేశంలో నివాళులర్పించారు.

Manmohan Singh funeral : న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల సమయంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం చెలరేగింది. తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా గౌరవించలేదని, ఆయన విషయంలో తీరని అన్యాయం చేశారని శర్మిష్ఠా ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు (శనివారం) అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్ వరకు మాజీ ప్రధాని అంతిమయాత్ర జరగనుంది. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ ప్రదేశంలోనే స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ తన తండ్రి విషయంలో కాంగ్రెస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించారని ప్రణబ్ ముఖర్జీ కూతురు ఆరోపించారు.

నా తండ్రిపై ఎందుకీ వివక్ష.. శర్మిష్టా మండిపాటు

మన్మోహన్ విషయంలో చూపిన శ్రద్ధ, ప్రేమ, గౌరవం తన తండ్రి ప్రణబ్‌ ముఖర్జీ (Pranab Mukherjee) ఎందుకు చూపలేదని శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ (CWC) సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ అనంతరం దేశానికి రాష్ట్రపతిగా సేవలు చేసినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి అధికారికంగా నివాళులు ఎందుకు అర్పించలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 

తప్పుదోవ పట్టించారు..
ప్రణబ్‌ ముఖర్జీ 2020లో మరణించారు. ఆ సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించకపోవడంపై శర్మిష్టా ముఖర్జీ పలు విషయాలు లేవనెత్తారు. నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ ఎందుకు నిర్వహించలేదని అడిగితే.. రాష్ట్రపతిగా చేసిన వారికి అలా చేయరని చెప్పి తనను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతులకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి సంతాపం తెలిసేపే ఆ సంప్రదాయం పాటించడం లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని తెలిపారు. కానీ తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందని... గతంలో రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించినట్లు అందులో ఉందన్నారు.

Also Read: Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మెమోరియల్ అనేది గొప్ప నిర్ణయం. అందుకు ఆయన అర్హులు. భారత రత్న రావాలని తన చేతుల మీదుగా ప్రదానం చేయాలని నాన్న అనుకున్నారు. కొన్ని కారణాలతో అలా జరగలేదని ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా ముఖర్జీ మరో ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP DesamMLC Candidate Dr. Prasanna Hari Krisha Interview | గ్రాడ్యూయేట్స్ గొంతుకనై పోరాడుతా | ABP DesamPM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP DesamBan vs Ind Champions Trophy 2025 | బాగానే ఆడిన బంగ్లా బాబులు..షమీ అన్న మాస్ కమ్ బ్యాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు 
జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
Modi And Pawan: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
Embed widget