మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు.



26 సెప్టెంబర్ 1932న పశ్చిమ పంజాబ్‌లో జన్మించారు.



దేశం మొదటి సిక్కు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్



2004 నుంచి 2014 వరకు రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.



పంజాబ్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.



పంజాబ్ యూనివర్శిటీలోనే 1952లో ఎకనామిక్స్‌లో డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.



1957లో కేంబ్రిడ్జ్‌లో ఎకనామిక్స్‌లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీ పొందారు.



1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కాలేజీలో డీ.ఫిల్‌ తీసుకున్నారు.



మన్మోహన్ పంజాబ్, ఢిల్లీ యూనివర్శిటీల్లో లెక్చరర్‌గా పనిచేశారు.



1960లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా చేరారు



1970 నుంచి 1980 వరకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు



1991లో భారత ఆర్థిక మంత్రిగా పనిచేశారు.



మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు - ఢిల్లీ, చండీగఢ్‌లో ఫ్లాట్ ఉంది



మన్మోహన్ సింగ్‌కు ఇద్దరు కుమార్తెలు



యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా పని చేశారు.