అన్వేషించండి

YSRCP : వైఎస్ఆర్‌సీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై - ఈ సారి పిఠాపురం నుంచి ...

Pithapuram : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.

Former Pithapuram MLA Dorababu Resigned from YCP :  ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్‌సీపీ నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా  చేస్తున్నట్లుగా ప్రకటించారు. పిఠాపురంలో ప్రెస్మీట్ పెట్టి వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. వైసీపీలో  తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ర్యాంకింగ్స్‌ను ఇస్తామని చెప్పిన  గడపగడపకు ప్రచారంలో తానే ముందున్నా నని ఆయన వెల్లడించారు.  అయినప్పటికీ జగన్ నుండి తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని కనీసం ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగలేదన్నారు. 

కార్యకర్తల నిర్ణయం మేరకే వైసీపీకి రాజీనామా                  

కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు   ఇప్పటికే కూటమినేతలు తనతో టచ్ లో ఉన్నట్టు చెప్పిన దొరబాబు త్వరలో కూటమిలోని ఓ పార్టీలో  చేరుతున్నట్లు స్పష్టం చేశారు.  ఇది తన రాజకీయ స్వలాభం కోసం కాదని కార్యకర్తల అభీష్టం మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఒక ఆకాంక్షతో తాను పార్టీ మారుతున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు  ఏ పదవి ఆశించడం లేదని కార్యకర్తలను తన అనుచరులను కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో పాటు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న ఒకే ఒక ఆకాంక్షతో వైసీపీ నుండి వీడి కూటమిలోకి చేరుతున్నట్లు దొరబాబు వెల్లడించారు.

పిఠాపురం నుంచి రెండు సార్లు గెలిచిన దొరబాబు           

పెండెం దొరబాబు సీనియర్ నేత. మొదటి బీజేపీలో ఉండగా ఆయన 2004లో విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా పోటీ చేశాయి. తర్వాత జరిగిన రాజకీయ పరిమామాల్లో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. ఓ సారి ఓడిపోయి..మరోసారి గెలిచారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు అనుచరగణం ఉంది. అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించడంతో.. దొరబాబు అభ్యర్థిగా అయితే తేలిపోతారని..కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. 

త్వరలో జనసేనలో చేరే అవకాశం                   

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును వైసీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలువలేదు. లదాంతో ఆయన ఎన్నికలకు ముందే పార్టీ మారిపోతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయనకు ఆఫర్ ఇచ్చినా సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నా ప్రయోజనం లేదన్న క్లారిటీకి వచ్చి ఆయన జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపారని..  చివరిగా గ్రీన్ సిగ్నల్ రావడతో వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు. త్వరలోనే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
Hero Destini 110 డైలీ యూజ్‌కు బాగానే ఉంటుందా? నిజ జీవిత మైలేజ్‌ వివరాలు ఇవే
హీరో డెస్టిని 110 మైలేజ్‌ టెస్ట్‌ - నిజంగా సిటీలో ఎంత ఇస్తుంది? హైవే ఎక్కితే ఎంత వస్తుంది?
Stock Market Crash: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
Flights Cancel: యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Embed widget