News
News
X

Nuzvid News : ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, గోడ కూలి నర్సరీ విద్యార్థి మృతి!

Nuzvid News : నూజివీడులో విషాద ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

FOLLOW US: 
Share:

Nuzvid News : ఏలూరు జిల్లా నూజివీడులో దారుణం జరిగింది. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో నర్సరీ విద్యార్థి మృతి చెందాడు. నూజివీడు పట్టణంలోని విష్డమ్ ప్రైవేట్ స్కూల్లో మరుగుదొడ్డి వద్ద గోడ కూలి విద్యార్థి నీల మణికంఠ (4) మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

అసలేం జరిగింది? 

నూజివీడులో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. గోడ కూలడంతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నూజివీడు పట్టణంలోని  విష్డమ్(wishdom)  ప్రైవేట్ పాఠశాలలో మరుగుదొడ్డి వద్ద గోడ కూలి నర్సరీ చదువుతున్న విద్యార్థి నీల మణికంఠ (4) మృతి చెందడం నూజివీడులో విషాదాన్ని నింపింది. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఈ ప్రమాదానికి గురికాగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అవ్వడంతో వారిని తల్లిదండ్రులకు యాజమాన్యం అప్పగించింది. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని బయటికి తెలియనీయలేదు. ఈ పాఠశాలను పాతకాలంనాటి భవనంలో నిర్వహిస్తున్నారు. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన కందుల కోటేశ్వరరావు, నందినిల కుమారుడు నీల మణికంఠ (4) ను విష్డమ్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాయి. అయితే మధ్యాహ్నం సమయంలో టాయిలెట్ కు వెళ్లిన మణికంఠ గోడ కూలడంతో రాళ్ల కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.  

చిన్నదెబ్బ అంటూ సమాచారం 

మణికంఠను చికిత్స కోసం స్థానిక మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మణికంఠ మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. నూజివీడు పట్టణ ఎస్సై శివన్నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తల్లిదండ్రులకు మణికంఠ ఒక్కడే కుమారుడు. మంచి పాఠశాలలో చదివిస్తే ప్రయోజకుడు అవుతాడని భావించి ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు వాపోయారు. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాము కుమారుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  మణికంఠ తల్లిదండ్రులకు మీ అబ్బాయికి చిన్న దెబ్బ తగిలింది అంటూ సమాచారం ఇచ్చారని, తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని తండ్రి ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి మణికంఠ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోలీసులను కోరారు. 

బిల్డింగ్ పై నుంచి పడి అంధ విద్యార్థి మృతి

 హైదరాబాద్ లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. అంధ విద్యార్థుల స్కూల్లో అనుకోని విషాదం జరిగింది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Published at : 25 Feb 2023 10:18 PM (IST) Tags: AP News Nuzvid Eluru News student died Private school

సంబంధిత కథనాలు

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్

CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?