అన్వేషించండి

IT raids on MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్

Andhra Pradesh : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.

IT raids on former YCP MP MVV Satyanarayanas house :  విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములుగా ఉన్న  ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ,  గద్దె బ్రహ్మాజీ వంటి వారిపై ఈడీ దాడులు నిర్వహించింది. విశాఖలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హయగ్రీవ యజమాని జగదీశ్వరుడు ఫిర్యాదు మేరకు ఇటీవల ఎంవీవీ, జీవీ, బ్రహ్మాజీపై కేసు నమోదు అయింది.  అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు నుంచి వివరాలు తీసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.  

హయగ్రీవ  భూముల వ్యవహారంపై నమోదు చేసిన కేసులో దాడులు        

విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్‌ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు.   వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది చేతులుమారింది.  అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. కోర్టు కేసులు ఉన్నాయి.  తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని  ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక

 ఈ కేసులో ముందస్తు  బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంవీవీ       

ఈ కేసు విషయంలో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఎంవీవీ సత్యనారాయణ కొన్నాళ్లు ఆజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. సినీ నిర్మాతగా పలు సినిమాలు తీసిన ఎంవీవీ విశాఖపట్నంలో ప్రముఖ బిల్డర్ గా ఉన్నారు. అయితే ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన కుటుంబాన్ని కొంత మంది రౌడీషీటర్లు ఇంట్లోనే బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత కిడ్నాప్ చేశారని.. మధ్యలో కాపాడామని పోలీసులు ప్రకటించారు. దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?

ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు.  వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.  వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తానే ఫిర్యాదు చేశానని  త్వరలో మాజీ సీఎం జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని ప్రకటించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు పెట్టుబడి సాయం వానాకాలంలో ఇవ్వలేం - మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వానాకాలం సీజన్ కు రైతు భరోసా లేదు - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
CM Chandrababu: 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
Elon Musk: ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతు పెట్టుబడి సాయం వానాకాలంలో ఇవ్వలేం - మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వానాకాలం సీజన్ కు రైతు భరోసా లేదు - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
CM Chandrababu: 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
Elon Musk: ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Viral News: గడ్డం మాకు అడ్డం అంటున్న అమ్మాయిలు! క్లీన్ షేవ్ కావాలంటూ ఏకంగా ప్రదర్శన
గడ్డం మాకు అడ్డం అంటున్న అమ్మాయిలు! క్లీన్ షేవ్ కావాలంటూ ఏకంగా ప్రదర్శన
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
Embed widget