అన్వేషించండి

EBIDD Fraud: ‘ఈబిడ్‌’ వ్యవహారంలో కొత్త కోణం.. సంస్థ ప్రతినిధుల ఆస్తులను రాయించుకున్న ముగ్గురు నేతలు!

ఓ సంస్థ పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించింది. రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశాక బోర్డు తిప్పేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులు ముగ్గురు నేతలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన నాయకులు ఏం చేశారంటే?

అనంతపురం కేంద్రంగా ఈబిడ్‌ (EBIDD) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గతేడాది కార్యకలాపాలు నిర్వహించింది. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి రూ. 300 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించింది. తీసుకున్న మొత్తం చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. బాధితులు తమకు న్యాయం చేయాలని ముగ్గురు రాజకీయ నాయకులను వేర్వేరుగా ఆశ్రయించారు. ఈ సమస్యను ఆయుధంగా మలుచుకున్న నేతలు.. కేసుల్లో ఇరికిస్తామని ఈబిడ్‌ సంస్థ నిర్వాహకుల్ని బెదిరించి.. వారి ఆస్తులను రాయించుకున్నారు. ఈబిడ్‌ నిర్వాహకులకు చెందిన రూ. కోట్ల విలువైన ఆస్తులను రాయించుకోవడంతో పాటు ఖరీదైన వాహనాలను బహుమతులుగా తీసుకున్నారు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఈ రాజకీయ నాయకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..

రూ.5 కోట్ల ఆస్తులు..
అనంతపురం జిల్లాకు చెందిన ఓ నాయకుడికి తెలిసిన వారు కొందరు ఈబిడ్ కంపెనీలో రూ. 1.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. దీనిపై చర్చించేందుకు సంస్థ నిర్వాహకులను పిలిపించిన సదరు నాయకుడు రూ. 5-6 కోట్ల విలువైన ఆస్తులను తన అనుచరుల పేరిట రాయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా సంస్థ నిర్వహాకులపై ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే జిల్లాకు చెందిన మరో రాజకీయ నాయకుడిని మరికొందరు బాధితులు కలిసి తమ సమస్య గురించి చెప్పారు. ఆయన కూడా ఈబిడ్ నిర్వాహకుల నుంచి రెండు ఖరీదైన కార్లను బహుమతిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలు పరిణామాలు చోటుచేసుకోవడంతో కార్లను వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం. మరికొందరు బాధితులు.. కడప జిల్లాకు చెందిన మరో నేతను కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన కూడా ఈబిడ్ నిర్వాహకులను బెదిరించి భారీగా లబ్ధి పొందారని సమాచారం. 

Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం

అసలేంటీ మోసం?
అనంతపురానికి చెందిన కడియాల సంతోష్‌, కడియాల సునీల్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈబిడ్‌ సంస్థను స్థాపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ కేంద్రంగా విధులు నిర్వర్తించేవారు. అయితే గతేడాది ఈ సంస్థను అనంతపురం రెవెన్యూ కాలనీలోనూ ప్రారంభించారు. తాము షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామని ప్రజలను నమ్మించారు. ఎవరైనా తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 30,000 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేశారు. దీనికోసం పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. డిపాజిట్లు కట్టిన వారికి కొన్నాళ్లపాటు నెలనెలా డబ్బులు కూడా చెల్లించారు. దీంతో మరికొంత మంది దీనికి ఆకర్షితులై డబ్బులు కట్టడం ప్రారంభించారు. దాదారు రూ. 300 కోట్ల వరకు డిపాజిట్లు వచ్చాక నెలవారీ డబ్బులు చెల్లించడం ఆపేశారు. ఏమైందని అడిగితే సరైన కారణాలు చెప్పేవారు కాదు. 

16 మంది ఫిర్యాదుతో..
కొన్నాళ్లకు తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలో ఈబిడ్‌ సంస్థపై అనంతపురం జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో కడియాల సునీల్‌ సహా మరో 17 మంది నిందితులుగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కేసుల నమోదు విషయం తెలియగానే.. సునీల్ పరారయ్యాడు. 

Also Read: పవన్ కల్యాణ్ పర్యటనపై టెన్షన్.. టెన్షన్.. అక్కడ నో ఎంట్రీ అని చెప్పిన పోలీసులు

Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget