అన్వేషించండి

Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Andhra News: విజయవాడ ఇంద్రకీలాద్రికి దసరా సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Devotees Rush In Vijayawada Temple: దసరా సందర్భంగా విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri) భక్తులతో కిటకిటలాడుతోంది. విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. రద్దీని బట్టి దర్శనానికి అనుమతించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం వేలాదిగా తరలివచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

భక్తుల ప్రత్యామ్నాయ మార్గాలు

అటు, భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోగా.. అధికారులు, పోలీసుల ఆంక్షలతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కొందరు భక్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఆశతో వచ్చామని.. ఇలా ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు.

తెప్పోత్సవానికి బ్రేక్

కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ వర్షం వచ్చి ఆటంకాలు ఎదురైతే మహా మండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మరోవైపు, తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. స్వామి వారి వాహన సేవలను దాదాపు 15 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శనివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. 'భక్తులకు సేవ చేయడమంటే భగవంతునికి సేవ చేయడమే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి చర్యలు చేపట్టాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. 8 రోజుల్లో 6 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించాం. 2.6 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఆలయంలో 3.2 లక్షల మందికి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించాం. 30 లక్షల లడ్డూలను విక్రయించాం.' అని ఈవో పేర్కొన్నారు.

వైభవంగా చక్రస్నానం

తిరుమలలో శనివారం ఉదయం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చకులు పుష్కరిణిలో క్రతువు నిర్వహించగా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

Also Read: Konaseema News: కబ్జా కోరల్లో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్‌- రోడ్లున పడ్డ ప్రయాణికులు- చోద్యం చూస్తున్న అధికారులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
US travel ban: ఈ 39 దేశాల నుంచి అమెరికాకు ఎవరూ వెళ్లలేరు - కొత్త ఏడాదిలో బ్యాన్ చేసిన ట్రంప్
ఈ 39 దేశాల నుంచి అమెరికాకు ఎవరూ వెళ్లలేరు - కొత్త ఏడాదిలో బ్యాన్ చేసిన ట్రంప్
Embed widget