అన్వేషించండి

Corona Cases In Schools: బడిలో కరోనా గంట.. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్

ఇటివలే ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు మెుదలయ్యాయి. అయితే మరోవైపు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతున్నారు.

పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు కూడా కాక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 8మంది టీచర్లకు, ఐదుగురు విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌గా తేలింది. అలాగే మంగళవారం 13 మంది టీచర్లలో 9మందికి, 35మంది పిల్లల్లో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 22న డక్కిలి మండలంలో ఓ ఉపాధ్యాయుడు కరోనా కారణంగా మృతిచెందాడు. 

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులోని ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పాఠశాలలో ఇటీవల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.  ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ 8వ వార్డు లో ఉన్న జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. 4వ తరగతి విద్యార్థులకు 26 మంది పిల్లలకు కరోనా టెస్ట్ చేయగా 10 మంది పిల్లలకు  పాజిటివ్ గా తేలింది. 

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాం గ్రామంలో నాల్గో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ గా తేలింది.  విద్యార్థులకు కరోనా పాజిటివ్ లు వస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలైంది. కరోనా కేసులు నమోదవుతున్న పాఠశాలల్లో చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.


కొత్తగా 1601 కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 58 వేల 890 మందికి కరోనా పరీక్షలు చేశారు. వైరస్‌ ప్రభావంతో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 1715 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 13వేల 677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read: Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పంట కొనుగోళ్లపై సీఎం రేవంత్ మాట తప్పారు: కేటీఆర్
పంట కొనుగోళ్లపై సీఎం రేవంత్ మాట తప్పారు: కేటీఆర్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
IRCTC Booking: ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
Breaking News:పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Embed widget