News
News
వీడియోలు ఆటలు
X

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 517 మందికి కరోనా పాజిటివ్.. కానీ అదొక్కటే ఊరట

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు గత కొన్నిరోజులుగా అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు క్రమంగా మెరుగవుతోంది.

FOLLOW US: 
Share:

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.  గడిచిన 24 గంటల్లో 38 వేల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 517 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,55,687కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 12 మందిని కరోనా మహమ్మారితో చనిపోగా, తాజాగా 8 మంది కోవిడ్19తో మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,276కు చేరుకుంది. 

ఏపీలో నమోదైన మొత్తం 20 లక్షల 55 వేల 687 కరోనా పాజిటివ్ కేసులకు గాను, ఇప్పటివరకూ 20,34,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. నిన్న ఒక్కరోజులో 826 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,615 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,88,39,595 (2 కోట్ల 88 లక్షల 39 వేల 595) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 38,786 శాంపిల్స్ పరీక్షించారు.

Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!

చిత్తూరులో అత్యధికం.. 
కోవిడ్19 బారిన పడి కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. అత్యధికంగా చిత్తూరులో 97 మందికి కరోనా సోకింది. తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరులో 84, కృష్ణాలో 71 మంది తాజాగా కరోనా బారిన పడ్డారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Oct 2021 05:25 PM (IST) Tags: coronavirus covid19 AP corona cases today AP News ap corona cases Corona Cases In AP Corona Positive Cases

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

Weather Latest Update: నేడు అక్కడక్కడా వడగాలులు, ఇంకో 3 రోజులు ఎండ అధికమే - కారణమేంటో ఐఎండీ

Weather Latest Update: నేడు అక్కడక్కడా వడగాలులు, ఇంకో 3 రోజులు ఎండ అధికమే - కారణమేంటో ఐఎండీ

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్

Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!