అన్వేషించండి

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం 

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి జగన్.. సోమవారం వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఒమిక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కొవిడ్‌ మహమ్మారి బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

కొవిడ్‌ మహ్మమారి కారణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అన్నది అత్యంత కీలకంగా మారింది. ట్యాంకర్ల ద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ తరలింపు కూడా అత్యంత సవాలుగా మారింది. వీటికోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని మొదటి, సెకండ్‌ వేవ్‌లో స్పష్టంగా చూశాం. గడచిన రెండేళ్లుగా మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. 

ఆస్పత్రుల ఆవరణలోనే ఈప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ పద్ధతిలో తయారైన ఆక్సిజన్‌, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్‌పీఎం ( లీటర్‌ పర్‌ మినిట్‌), 500 ఎల్‌పీఎం సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

పరిస్థితిని బట్టి, ఆస్పత్రి సామర్థ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఎక్కువ ప్లాంట్లు కూడా నెలకొల్పారు. శ్రీకాకుళంలో 12 చోట్ల, విజయనగరంలో 2 చోట్ల, విశాఖపట్నలలో 12 చోట్ల, తూర్పుగోదావరిలో 13 చోట్ల, పశ్చిమగోదావరిలో 7 చోట్ల, కృష్ణాలో 12 చోట్ల, గుంటూరులో 7 చోట్ల, ప్రకాశంలో 5 చోట్ల, నెల్లూరులో 7 చోట్ల, చిత్తూరులో 21 చోట్ల, కడపలో 8 చోట్ల, అనంతపురంలో 9 చోట్ల, కర్నూలులో 9 చోట్ల.. మొత్తంగా 124 ప్రాంతాల్లో 133 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 11 ప్లాంట్లకు పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 144 ప్లాంట్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిమొత్తం సామర్థ్యం దాదాపుగా 1.2 లక్షల ఎల్‌పీఎం పైమాటే. అంటే ఒక నిమిషలలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఈ ప్లాంట్ల నుంచి తయారు అవుతుంది. 

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 18,268 ఆక్సిజన్‌ పైపులైన్లను రూ.40.07 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పైపులైన్లను మరింత బలోపేతం చేయడానికి 6,151 ఆక్సిజన్‌ లైన్లు వేయడంతోపాటు మరో రూ.50 కోట్లు ఖర్చుచేశారు. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వకోసం 399 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లను 35 ఆస్పత్రుల్లో రూ.15 కోట్లతో ఏర్పాటు చేశారు. మరో 39 ఆస్పత్రుల్లో 390 కిలో లీటర్ల సామర్థ్యంతో రూ.16.3 కోట్లు ఖర్చు చేసి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. 

అంతేగాక లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ, రవాణాకోసం 20 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్‌ ఐఎస్‌ఓ ట్యాంకర్లను రూ. 15.25 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 20 వీఆర్‌ఎల్‌ ల్యాబ్స్‌ను రూ. 6.22 కోట్లతో ఏర్పాటు చేసి టెస్టింగ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. మరో రూ.21.93 కోట్లతో కీలకమైన సివిల్‌ వర్క్స్‌ను పూర్తిచేసింది. 26,746 డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లను కొనుగోలు చేసింది. ఈసీఆర్పీ–2 కింద 64.05 కోట్లతో పీడియాట్రిక్‌ కేర్‌ ఆక్సిజన్‌ సపోర్ట్‌ ఉన్న బెడ్స్‌ను 183 సీహెచ్‌సీల్లో ఏర్పాటు చేశారు. 230 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను 23 ఆస్పత్రుల్లో రూ.8.05 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.

వీటన్నింటి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.426కోట్లను ఖర్చు చేసింది. ఈ సదుపాయలన్నింటినీ సీఎం జగన్.. సోమవారం ప్రారంభించనున్నారు. ఈ రూ.426 కోట్లే కాకుండా క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగంగా మెడికల్‌ పరికరాలు, కొవిడ్‌ కిట్లు, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.297.36 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా మూడోవేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగమే.

ఒమిక్రాన్‌ వైరస్‌ నిర్ధారణ కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో కేరళ తర్వాత మన రాష్ట్రంలోని విజయవాడలో ఈ ల్యాబ్‌ ఏర్పాటైంది.

Also Read: Minister Appalaraju: చంద్రబాబు ఇది రాసి పెట్టుకో... ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి... మంత్రి సీదిరి అప్పలరాజు

Also Read: Tirupati: లైంగిక వేధింపులు వర్సెస్ చికెన్ పకోడా ... ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో రచ్చ రచ్చ

టాప్ హెడ్ లైన్స్

Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Chandra Babu On YS Jagan: కోర్టుల వెనుక దాక్కుంటున్న జగన్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
కోర్టుల వెనుక దాక్కుంటున్న జగన్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget