అన్వేషించండి

Macherla Turaka Kishore Arrested: పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు

Andhra Pradesh News | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను జయపురి సౌత్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Pinnelli Ramakrishna Reddy Follower Turaka Kishore Arrested | మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పలు అరాచకాలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కిశోర్‌ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కిశోర్‌పై మూడు హత్యాయత్నం కేసులతో పాటు పలు దాడి కేసులున్నాయి. మల్కాజిగిరిలోని జయపురికాలనీలో కిశోర్‌ను విజయపురి సౌత్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో కిశోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతడు టీడీపీ నేతల వాహనాలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ కావడం తెలిసిందే.

ఎన్నికల తరువాత అజ్ఞాతంలోకి కిశోర్

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన అనంతరం తురక కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాచర్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలతో గత ఏడాది ఏడాది మే నెలలో పిన్నెల్లి సోదరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటినుంచి వారి ప్రధాన అనుచరుడు కిశోర్ జాడ సైతం పోలీసులకు దొరకలేదు. ఏపీలో ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు ఏపీని వీడటంతో వారి అనుచరుడు కిశోర్ బెంగళూరుకు వెళ్లి తన సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం జయపురి సౌత్ ఎస్సై షఫీ టీమ్ నగరానికి వచ్చింది. ఆదివారం ఉదయం వైసీపీ నేత కిశోర్‌తో పాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మాచర్లకు తీసుకొచ్చి ఓ రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు నేడు (సోమవారం) కిశోర్, అతడి సోదరుడ్ని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై పరిశీలకులుగా టీడీపీ తరఫున బొండా ఉమ, బుద్ధా వెంకన్నలను చంద్రబాబు అక్కడికి పంపారు. మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వీరి వాహనంపై దాడికి దిగారు. ఈ క్రమంలో పెద్ద కర్రతో కిశోర్ టీడీపీ నేతల వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కిశోర్‌ను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌ను చేయగా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు.

వైసిపి మాజీ మున్సిపల్ చైర్మన్ కిషోర్ అరాచకాలు...
డిసెంబర్ 16 ,2022 న తెలుగుదేశం పార్టీ మాచర్లలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు కిశోర్. టిడిపి ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పై దాడి చేశారని ఆరోపణలున్నాయి. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో టిడిపి ఆస్తులను, టీడీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 

2024 మే నెలలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు హింసకాండలో ప్రధాన నిందితుడు కిశోర్. ఎన్నికల రోజు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు మాచర్లలో తిరుగుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డాడని తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టిడిపి నేత కేశవరెడ్డిపై దాడికి పాల్పడి పలువురిని గాయపరిచిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల మరుసటి రోజు కారంపూడి పట్టణంలో టీడీపీ నేతలు, ఇళ్లు లూటీ, వారి ఆస్తులపై విధ్వంసానికి పాల్పడుతుంటే అడ్డుకున్న సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు కిశోర్. ఈ కేసులో కిశోర్ ఏ2గా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో అనుచరుడు మన్నెయ్య కోర్టులో లొంగిపోయాడు. 
Also Read: Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Vishnupriya Latest News: నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Vishnupriya Latest News: నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
Vaishnavi Chaitanya: నిర్మాత ఎస్కేఎన్‌తో గొడవల్లేవ్... ఆయన నన్నేమీ అనలేదు - 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య
నిర్మాత ఎస్కేఎన్‌తో గొడవల్లేవ్... ఆయన నన్నేమీ అనలేదు - 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Viral News: కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Embed widget