By: ABP Desam | Updated at : 17 Jan 2022 03:20 PM (IST)
కరోనాపై జగన్ సమీక్ష
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వైరస్లు విస్తరిస్తున్న కారణంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని వస్తున్న డిమాండ్పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ కోవిడ్ పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిచారు. ఇందులో స్కూళ్ల నిర్వహణ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సంక్రాంతి సెలవుల అనంతరం యథావిధిగా స్కూళ్లు కొనసాగుతాయి. ఆదివారంతో సంక్రాంతి సెలవులు ముగిసిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించడంతో ఏపీ ప్రభుత్వం కూడా అ దిశగా నిర్ణయం తీసుకుంటుందన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. అయితే పరిస్థితిని గమనించి.. కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు సెలవులు ప్రకటించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Also Read: నారా లోకేష్కు కరోనా - హోం ఐసోలేషన్లో చికిత్స !
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కోవిడ్ పరిస్థితులపై సమీక్ష సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధులకు ఇప్పుడు ఇస్తున్న ప్రికాషన్ డోస్ లేదా బూస్టర్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కుదిరితే ఇంకా తగ్గించాలని కోరనున్నారు. 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయానికి వచ్చారు.
Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ
ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆక్సిజన్ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రెండో డోస్ వ్యాక్సినేషన్లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.కోవిడ్ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని సీఎంకు అధికారులు తెలిపారు.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్ స్ట్రోక్