అన్వేషించండి

Kuppam Mining: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు

కుప్పం నియోజకవర్గంలో క్వారీలలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారని నిర్థారించిన అధికారులు... సామాగ్రిని సీజ్ చేశారు. ఇటీవల కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చంద్రబాబు ఆరోపించారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలు అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపునకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన తరుణంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. 

Kuppam Mining: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు

చంద్రబాబు ఆరోపణలతో వెలుగులోకి 

ఈ నెల మొదటి వారంలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మూడు రోజుల పాటు ఇక్కడే గడిపారు. చివరి రోజు అనూహ్యంగా ఆయన అక్రమ క్వారీలను సందర్శించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న తీరును చూసి నివ్వెర పోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతున్నట్లు స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. క్వారీ జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా చంద్రబాబు పరిశీలించారు. స్థానిక వైసీపీ నేతలు అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఆశీస్సులతోనే కుప్పం వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాగా చంద్రబాబు ఆరోపణలు చేసిన 24 గంటల వ్యవధిలోనే మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 

Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?

మైనింగ్ అధికారుల వరుస దాడులు 

చంద్రబాబు పర్యటించిన శాంతిపురం మండలంలోని ముద్దునపల్లె, సి బండపల్లి గ్రామాలలోని క్వారీలను అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డితో సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో అక్రమ క్వారీ జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన మైనింగ్ అధికారులు ఎట్టకేలకు దూకుడు పెంచారు. పెద్ద ఎత్తున మైనింగ్ అధికారులు కుప్పం చేరుకొని, నాలుగు బృందాలుగా విడిపోయి పలు క్వారీలలో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనేక చోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గడచిన పది రోజులుగా కుప్పం నియోజకవర్గం అంతటా మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మైనింగ్ కు వినియోగించే నాలుగు ప్రొక్లెయినర్లు, 10 కంప్రెసర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న 200 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఈ దాడులు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా అధికారుల తనిఖీలతో మైనింగ్ మాఫియా ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు.

Also Read: కొత్త పీఆర్సీపై రంగంలోకి వాలంటీర్లు... ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget