అన్వేషించండి

AP RTC Employees : ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?

ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమాలు చేసి ప్రభుత్వంలో విలీనమయ్యారు. కానీ ఇప్పుడు తమకు తీవ్ర నష్టం జరుగుతోందని సమ్మెకు సై అంటున్నారు. వారేం నష్టపోయారు..? ఏం కోరుకుంటున్నారు ?

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఇతర ఉద్యోగులతో పాటు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబడి పోరాడి సాధించుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. అలాంటిది ఇప్పుడు వారికి వచ్చిన కష్టం ఏమిటి..? వారు కూడా ఏం కోరుతున్నారు..? ఎందుకు సమ్మెకు వెళ్తామంటున్నారు..?

Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

కార్పొరేషన్‌ ఉద్యోగులుగా ఉన్న సౌకర్యాలు మాయం !

ఏపీఎస్ఆర్టీసీ కింద గతంలో ఉద్యోగులు ఉండేవారు. ఇది ప్రత్యేకమైన కార్పొరేషన్. ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వంలో విలీనం చేశారు. పీటీడీ ఉద్యోగులుగా మార్చేశారు దీంతో కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఉన్న మెడికల్‌ సౌకర్యం స్థానంలో ఇ.హెచ్‌.ఎస్‌. కిందకు వచ్చారు. ఇప్పుడు వారికి వైద్యం గతంలోలా సరళంగా అందడం లేదు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు తక్కువ.. కార్మికులు ఎక్కువ. ఉదాహరణకు డ్రైవర్‌, కండెక్టర్‌, మెకానికల్‌ కాటగిరీ ఉద్యోగులకు కార్మిక చట్టల ప్రకారం పని గంటలు ఉండేవి. కానీ ఉద్యోగులుగా మారిన తర్వాత ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను వర్తించడం లేదు. విలీనం కాకముందు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాల్సి ఉందని.. వాటిని ఇవ్వలేదని అంటున్నారు. ఆర్టీసి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న స్టాఫ్‌ రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్‌ స్కీమ్‌ ను రద్దు చేశారు.


కొత్త ఉద్యోగ నియామకాలు నిలిపివేత !

ఆర్టీసీ ఎక్కువగా మ్యాన్ పవర్ మీద ఆధారపడుతుంది. అయితే ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగాల నియామకం ఊసే లేదు. ప్రస్తుతానికి ఆర్టీసీలో 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. తాత్కాలికంగా బండి నడిపించడానికి ఔట్ సోర్సింగ్ పద్దతిని ఎంచుకుంటున్నారు. అలాగే  సర్వీసులో చనిపోయిన వారికి ఇచ్చే ఇన్సూరెన్స్‌ పథకాల ప్రీమియమ్‌లు అన్నీ ఉద్యోగుల వేతనాల నుండే రికవరీ చేస్తున్నారు. ఈ కాలంలో ఉద్యోగులకు వివిధ రకాల రికవరీలు పెరిగాయి. ఇలా వివిధ కారణాలతో విలీనంతో ష్టపోయామన్న భావనకు ఆర్టీసీ ఉద్యోగులు వస్తున్నారు.

AP RTC Employees : ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి !  ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?

Also Read: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

ఆమోదించిన పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలపై లేని స్పష్టత ! 

ఆర్టీసి ఉద్యోగులకు 1.6 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే సిఫార్సు చేశారు. విలీనంతో ప్రభుత్వ ఫించను వస్తుందని ఆశించిన ఆర్టీసి ఉద్యోగులకు సీపీఎస్ లేదా పీఎఫ్ పించన్ ఆప్షన్ ఇచ్చారు. ప్రభుత్వం బయట పెట్టని అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఆర్టీసి ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ సిఫారసు చేసినట్లుగా చెబుతున్నారు. విలీనం వల్ల నష్టపోతున్న ప్రయోజనాలు.. పీఆర్సీ వల్ల కోల్పోతున్న ప్రయోజనాలు భర్తీ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సంక్షేమ అంశాలను పి.టి.డి.ఉద్యోగులకు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు . ఈ డిమాండ్లతో వారూ సమ్మెకి సై అంటున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Advertisement

వీడియోలు

Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
రికార్డుల రారాజు.. బ్యాటంబాంబ్ అభిషేక్
ఇంకో పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. వీళ్ల బుద్ధి మారదురా బాబూ..!
పీసీబీకి అంపైర్ ఫోబియో.. మరో రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్
పాకిస్తాన్ ఫ్యూచర్ తేలేది నేడే.. ఓడితే ఇంటికే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Tirumala: తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
Viral Crime: శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
Swadesh: మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
Embed widget