అన్వేషించండి

Chandrababu Tour: సీమను మార్చేది నీళ్లు - తిట్లు శాపనార్థాలు ఏమీ చేయలేవు - హంద్రీనీవా ప్రారంభోత్సవంలో చంద్రబాబు

Rayalaseema: రాయలసీమను రతనాల సీమగా నీళ్లే మారుస్తాయని చంద్రబాబు అన్నారు. మాల్యాలలో హంద్రీనీవా మొదటి దశ ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు.

Chandrababu Naidu :  హంద్రీ-నీవా ప్రాజెక్టును రాయలసీమకు జీవనాడి అని..  నీళ్లు ఉంటే రాయలసీమను రత్నాల సీమగా చేయవచ్చన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారని.. అది ఆయన కల అన్నారు. తాను పూర్తి చేశానన్నారు. . ఈ ప్రాజెక్టు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప,  చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు,  33 లక్షల మందికి తాగునీరు అందించనుందన్నారు.  రాయలసీమను కరువు నుండి విముక్తి చేసి, “రాళ్లసీమ”ను “రత్నాలసీమ”గా మారుస్తుందన్నారు.  

కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే  696 కోట్ల రూపాయలతో మొదటి దశ కాలువ విస్తరణ పనులను పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విస్తరణతో కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్స్ నుండి 3,850 క్యూసెక్స్‌కు పెరిగిందని తెలిపారు.  2014-2019 మధ్య తమ ప్రభుత్వం రాయలసీమ కోసం రూ. 12,441 కోట్లు, హంద్రీ-నీవా కోసం  రూ. 4,200 కోట్లు ఖర్చు చేసిందని, గొల్లపల్లి, చెర్లోపల్లి, మరాల, జీడిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేసిందని గుర్తుచేశారు.  ప్రస్తుతం 512 ఏజెన్సీలు, 1,040 మెషీన్‌లతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జూలై 31 నాటికి పుంగనూరు,  కుప్పం బ్రాంచ్ కాలువలకు నీటిని సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  

రాయలసీమ రైతుల జీవితాలను మెరుగుపరచడం తన సిద్ధాంతమని, ఈ ప్రాజెక్టు ద్వారా కరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో కరువు పూర్తిగా అంతరించిపోతుందని, ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందన్నారు.  ఈ ప్రాజెక్టును మొదట 1985-86లో ఎన్టీ రామారావు రూపొందించారని, ఆయన రాయలసీమ కరువు సమస్యను గుర్తించి ఈ ప్రాజెక్టును ఒక కలగా ఊహించారని చంద్రబాబు గుర్తు చేశారు.                     
 
 జగన్ లాంటి వాళ్లు శాపాలు ఇచ్చినా నాపై పని చేయన్నారు.  జగన్ లాంటి వాళ్లు ఏం చేయగలరు? వారి శాపాలు నాపై పని చేయవు” అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 2019-2024 మధ్య రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 2,000 కోట్లు కూడా కేటాయించలేదని, హంద్రీ-నీవాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఒక్క చాన్స్ ఇస్తే బాదుడే బాదుడు అన్నట్లుగా పాలన చేశారని మండిపడ్డారు.                     

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget