అన్వేషించండి

Kuppam: కుప్పం గడ్డపై గిన్నీస్ రికార్డ్- 5555 ఈ-సైకిళ్ల పంపిణీతో సరికొత్త చరిత్ర!

Guinness Book of Records: కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. ఈ సందర్భంగా చంద్రబాబు సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు.

Chandrababu Naidu e-cycle distribution program Guinness Records:  పర్యావరణ పరిరక్షణ ,  మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమం  గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. గిన్నీస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందుకున్నారు.                           

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభా స్థలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఆయన స్వయంగా ఈ-సైకిల్ తొక్కారు. వేలాది మంది మహిళలు తమ ఇ-సైకిళ్లతో ముఖ్యమంత్రిని అనుసరిస్తుండగా, ఆ ప్రాంతమంతా  సైకిల్  నినాదాలతో హోరెత్తింది.  ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారని, అందుకే అభివృద్ధి అంటే ఏంటో సైకిల్ వేగంతో చేసి చూపిస్తున్నామని చంద్రబాబు ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.                           

ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం  మేక్ ఇన్ కుప్పం . ప్రముఖ సంస్థ  ఇ-మోటరాడ్  (EMotorad) భాగస్వామ్యంతో కుప్పంలోని స్థానిక యూనిట్ లోనే ఈ సైకిళ్లను అసెంబ్లింగ్  చేస్తున్నారు.  దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, సాంకేతికత గ్రామీణ స్థాయికి చేరువైంది. ఈ సైకిళ్లను ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఒక్క పైసా ఖర్చు లేకుండా మహిళలు తమ పనుల కోసం వీటిని వాడుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.             

 
రూ. 24 వేల విలువైన ఈ సైకిళ్లను ప్రభుత్వం భారీ సబ్సిడీతో కేవలం రూ. 5 వేలకే లబ్ధిదారులకు అందజేస్తోంది. దీనివల్ల గ్రామీణ మహిళల రవాణా కష్టాలు తీరడమే కాకుండా, వారి ఆర్థిక పురోగతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నుంచి ప్రారంభమైన ఈ  గ్రీన్ మొబిలిటీ విప్లవం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.           

 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget