అన్వేషించండి

Kuppam: కుప్పం గడ్డపై గిన్నీస్ రికార్డ్- 5555 ఈ-సైకిళ్ల పంపిణీతో సరికొత్త చరిత్ర!

Guinness Book of Records: కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. ఈ సందర్భంగా చంద్రబాబు సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు.

Chandrababu Naidu e-cycle distribution program Guinness Records:  పర్యావరణ పరిరక్షణ ,  మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమం  గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. గిన్నీస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందుకున్నారు.                           

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభా స్థలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఆయన స్వయంగా ఈ-సైకిల్ తొక్కారు. వేలాది మంది మహిళలు తమ ఇ-సైకిళ్లతో ముఖ్యమంత్రిని అనుసరిస్తుండగా, ఆ ప్రాంతమంతా  సైకిల్  నినాదాలతో హోరెత్తింది.  ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారని, అందుకే అభివృద్ధి అంటే ఏంటో సైకిల్ వేగంతో చేసి చూపిస్తున్నామని చంద్రబాబు ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.                           

ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం  మేక్ ఇన్ కుప్పం . ప్రముఖ సంస్థ  ఇ-మోటరాడ్  (EMotorad) భాగస్వామ్యంతో కుప్పంలోని స్థానిక యూనిట్ లోనే ఈ సైకిళ్లను అసెంబ్లింగ్  చేస్తున్నారు.  దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, సాంకేతికత గ్రామీణ స్థాయికి చేరువైంది. ఈ సైకిళ్లను ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఒక్క పైసా ఖర్చు లేకుండా మహిళలు తమ పనుల కోసం వీటిని వాడుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.             

 
రూ. 24 వేల విలువైన ఈ సైకిళ్లను ప్రభుత్వం భారీ సబ్సిడీతో కేవలం రూ. 5 వేలకే లబ్ధిదారులకు అందజేస్తోంది. దీనివల్ల గ్రామీణ మహిళల రవాణా కష్టాలు తీరడమే కాకుండా, వారి ఆర్థిక పురోగతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నుంచి ప్రారంభమైన ఈ  గ్రీన్ మొబిలిటీ విప్లవం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.           

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget