అన్వేషించండి

Kuppam Chandrababu : కుప్పం టీడీపీలోకి భారీగా చేరికలు - పసుపు కండువా కప్పుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు !

కుప్పంలో ఇతర పార్టీల నేతల్ని భారీగా టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు. కుప్పంలో చంద్రబాబు పర్యటన రెండో రోజు సాగుతోంది.


Kuppam Chandrababu :  చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ..టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచుకొన్నారు. కుప్పం మాజీ ఎమ్మెల్యే బి. ఆర్ దొరస్వామి నాయుడు తనయుడు డాక్టర్ సురేష్ బాబు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చురుకైనా పాత్ర పోషించారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి కుప్పం, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ, గత అసెంబ్లీ ఎన్నికలల్లో కుప్పం నుండి చంద్రబాబు పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  కుప్పం నియోజకవర్గంలో విస్తృత పరిచయలు కల్గిన డాక్టర్ గా సురేష్ బాబు సుపరిచితులుగా ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకోనేందుకు సిద్దమై టిడిపి ఆహ్వానించింది. 

డా. సురేష్ బాబు అనుచరులు, బి ఆర్ డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ..సురేష్ బాబును తెలుగుదేశం పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. సురేష్ బాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు.కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా...ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. సందప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తామన్నారు. ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.              
  
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవ్రగంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  పర్యటించనున్నారు. ఎప్పుడూ తన పర్యటనలో గ్రామాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ, జనాలతో మమేకమయ్యేవారు. ఈసారి మాత్రం పార్టీ శ్రేణులతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  కుప్పంలోని బీసీఎన్‌ కల్యాణ మండపంలో నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.    కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తరపున గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సమన్వయ కమిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంకోసం చంద్రబాబు ఈ పర్యటనను పెట్టుకున్నారు.          

బూత్‌ స్థాయినుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలదాకా వేర్వేరుగా సమావేశాలు జరుగనున్నాయి. ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత నిబద్ధతతో, బాధ్యతతో గెలుపుకోసం కృషి చేయాలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు తెలియజెప్పనున్నారు. పార్టీ శ్రేణులు లక్ష మెజారిటీ లక్ష్యం గురించి ప్రెస్మీట్లు, సమావేశాల్లో చెప్పడం కాదు.. నిరంతరం ప్రజల్లో ఉండడమే ఏకైక మార్గమని చాలాసార్లు చంద్రబాబు వారికి స్పష్టంచేశారు. ఈ మార్గాన్ని తప్పనిసరిగా వారిచేత అమలు చేయించడానికి అవసరమైన దిశానిర్దేశం చేయడమే ప్రధాన కర్తవ్యంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది.                      

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget