By: ABP Desam | Updated at : 25 May 2023 04:48 PM (IST)
కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న చంద్రబాబు
Constable Death Issue : అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల దగ్గర జరుగుతున్న పనులకు రక్షణగా ఉంటున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుతో చనిపోవడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ఇటీవల తుళ్లూరు మండలం అనంతరంలో పాముకాటుకు గురికావడం, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాము కాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసిందని చంద్రబాబు మండిపడ్డారు. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ, వారి క్షేమం గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఇది అని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నానని వెల్లడించారు. కానిస్టేబుల్ పవన్ కుమార్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతిలో R5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరం. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసింది. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ వారి క్షేమం… pic.twitter.com/Sh7lyebIW6
— N Chandrababu Naidu (@ncbn) May 25, 2023
ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీకి సన్నద్ధమవుతుండగా, ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను ఇక్కడకు రప్పించారు. ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్... రాత్రి వేళ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయం వద్ద ఇతర కానిస్టేబుళ్లతో పాటు విశ్రమించారు. నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో, ఆయన పామును పట్టుకుని ఇవతలికి లాగారు. దాంతో పాము చేతిపై కూడా కాటు వేసింది. ఆయనను ఇతర కానిస్టేబుళ్లు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందారు.
గత ప్రభుత్వం అమరావతి కోసం భూములు సమీకరించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులేమీ చేయకపోవడంతో అక్కడంతా పెద్ద ఎత్తున ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. అడవిలా మారింది. ఇటీవల ఆ స్థలాల్లో ఆర్ 5 జోన్ పేరుతో ఏర్పాటు చేసి సెంటు స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ బందోబస్తుకు వచ్చిన వారికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ నిద్రించాల్సి వస్తోంది. అసలే అడవిలా ఉండటంతో పాములు తరచూ బయటకు వస్తున్నాయి. ఇలా కింద పడుకున్న కానిస్టేబుల్ ను నిద్రలోనే కాటు వేయడంతో ఆయన ప్రాణం పోయింది.
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం