అన్వేషించండి

National Handloom Day: గాంధీ మెచ్చిన ఖద్దరు ఇది.. పొందూరు ఖ్యాతిని మరింత పెంచాలి: సిక్కోలు పర్యటనలో నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పొందూరులో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన ఆమె... ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పొందూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. ఇక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.


National Handloom Day: గాంధీ మెచ్చిన ఖద్దరు ఇది.. పొందూరు ఖ్యాతిని మరింత పెంచాలి: సిక్కోలు పర్యటనలో నిర్మలా సీతారామన్

పొందూరు ఖద్దరు ఖ్యాతిని మరింత పెంచాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను పరిశీలించారు. ఖాదీ భవనం నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రధాని మోదీ పలు పథకాలు ప్రకటించారని ఆమె అన్నారు. 
Also Read: YSRCP Vs BJP: ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవట్లేదు. మీరే గొయ్యి తవ్వుకున్నారు.. వైసీపీకి బీజేపీ కౌంటర్..!


National Handloom Day: గాంధీ మెచ్చిన ఖద్దరు ఇది.. పొందూరు ఖ్యాతిని మరింత పెంచాలి: సిక్కోలు పర్యటనలో నిర్మలా సీతారామన్
 
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. శ్రీకాకుళంలో పర్యటన అనంతరం నేటి మధ్యాహ్నం 3 గంటలకు జేవీఆర్‌ కన్వెన్షన్‌లో బీజేపీ శ్రేణులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అనుమతి పాస్‌లు ఉన్నవారికే ఈ సమావేశానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

నిర్మలమ్మకు ఉక్కు సెగ

నిన్న సాయంత్రం విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు ఉక్కు కార్మికుల సెగ తగిలింది. ఆమె రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. సీతారామన్ రాక విషయాన్ని తెలుసుకుని భారీ సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
Also Read: Andhra Pradesh: వేషం మార్చిన సబ్ కలెక్టర్... షాక్‌లో ఎరువుల దుకాణదారులు… ఆనందంలో రైతులు

గాంధీ మెచ్చిన ఖద్దరు..

పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఒక రకమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీస్తారు. ఈ దారాలను మగ్గాలపై ఒడికి ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తుచేస్తుంది. మహాత్మా గాంధీ పొందూరు ఖద్దరు ఇష్టపడేవారు. పొందూరులో ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై ఖద్దరు వస్త్రాలు నేస్తారు. మగ్గాలతోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల సాయంతో ఖద్దరు వస్త్రాలు నేస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget