అన్వేషించండి

AP BJP : తప్పులను ఎత్తి చూపితే కొట్టమని సీఎం అంటున్నారు - జగన్‌పై ఏపీ బీజేపీ నేతల ఫైర్ !

సీఎం జగన్ తీరుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు.

 

AP BJP :   ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే తట్టి, కొట్ట మని అధికారులకు సీఎం చెపుతున్నారని  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీఎం జగన్ పై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం పోలవరం డిపిఆర్ పైన అనేక ఆరోపణలు చేసిన వైసీపీ మళ్ళీ అదే డిపిఆర్ ని కేంద్రానికి సబ్మిట్ చేస్తోందన్నారు. 45.72 అడుగులు పోలవరం కట్టాలి అనుకుంటున్నారో ..  41.15 అడుగులు  కట్టాలి అనుకుంటున్నారో సీఎం సమాధానం చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. 85 టీఎంసీల నీరు ఇస్తా అని ఇవ్వకుండా సీఎం విశాఖ వాసులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2015లో కేంద్రానికి మెట్రో డిపిఆర్  అప్పటి ప్రభుత్వం పంపిందని..  2017 లో రివైజ్డ్ డీపీఆర్ పంపాలి అని కేంద్రం చెపితే, ఇప్పటి వరకూ పంపలేదన్నారు. కానీ ప్రధానికి మాత్రం అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు.  

2019 డిసెంబర్ 19 న ఎన్‌ఎండీసీతో  అవగాహవ చేసుకుని, 23 డిసెంబర్ లో కడప స్టీల్ ప్లంట్ కి భూమి పూజ చేశారని గుర్తు చేశారు.  3 సంవత్సరాల తరవతా మళ్ళీ డిసెంబర్ 23 కడప వెళ్లి స్టీల్ ప్లాంట్ నేనే కడతా అంటున్నారని విమర్శించారు.  ఒక్కో మెడికల్ కాలేజ్ కి కేంద్రం 195 కోట్లు ఇస్తే ఒక్క చిన్న పని చేయకుండా మళ్ళీ కేంద్రాన్ని మరిన్ని కాలేజ్ లు కావాలి అని అడుగుతున్నారని విమర్శఇంచారు. గత 2 సంవత్సరాల్లో 2 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇస్తే ప్రజలకు చేరింది కేవలం 20% మాత్రమేనని.. మిగతా అంతా దోచేశారని ఆరోపించారు. 1.75 లక్షల కుటుంబాలు పేదరికం లో ఉన్నాయి అని సీఎం జగన్ చెపుతున్నారని..  బియ్యం ఎందుకు పంపిణీ చేయరని ప్రశ్నించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు రేషన్ బియ్యాన్ని అందించడాన్ని ఇంకో సంవత్సరం పొడిగించారని సత్యకుమార్ గుర్తు చేశారు. 

రాష్ట్రంలో 7 రైల్వే ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంటే సీఎం దాని పైన మాట్లాడరని.. ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు కేటాయించరన్నారు. విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్ చేయడం సంతోషం, కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి పై మాకు అనుమానం ఉందన్నారు.   మంత్రి అమర్ తన శాఖల మీద మాట్లాడటం కన్నా, రాజకీయ పై మాట్లాడతానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని మండిపడ్డారు.  ఇన్ఫోసిస్ వస్తుంది అన్నారు 4 నెలలు గడిచింది ఇంకా ఇన్ఫోసిస్ రాలేదన్నారు. సీఎం, ఐటీ మంత్రి యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అమర్ కి సందులు గొందులు మీద ఉన్న అవగాహనా తన శాఖల పైన లేదన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు. స్మార్ట్ మీటర్లకు బిగించుకోవాలి అంటే 1350 రూపాయలు కేంద్ర ఇస్తుందని.. అంతకు మించి దోపిడీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. 

దావోస్ కి బ్యాండ్ మేళం లాగా అంత మంది వెళ్లి ఎంత పెట్టుబడి తెచ్చారో చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.  నరేంద్ర మోదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు పెడుతుంటే, సీఎం జగన్ మాత్రం తిట్లకు సెంటర్లు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ వెళ్తుందని ప్రచారం జరుగుతున్న విషయంపై సత్యకుమార్ స్పందించారు. దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ లో వైసీపీ లో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget