అన్వేషించండి

Badvel By Poll: బద్వేల్ ఉపఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం... పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటన..

బద్వే్ల్ ఉపఎన్నికపై రసవత్తరంగా మారుతోంది. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటున్నామని టీడీపీ ప్రకటించింది. జనసేన కూడా పోటీ నుంచి వైదొలిగింది.

కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చిన కారణంగా పోటీకి విముఖత వ్యక్తంచేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని ప్రకచించింది. వైసీపీ ఎమ్మెల్యే  వెంకటసుబ్బయ్య క్యాన్సర్ వ్యాధి కారణంగా మృతి చెందారు. దీంతో బద్వేల్‌ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే పొలిట్‌ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్‌ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ ఖరారు చేసింది. 2019లో బద్వేల్‌ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. సంప్రదాయాలకు గౌరవించి ఏకగ్రీవానికి సహకరించాలని చంద్రబాబు అన్నారు. 


Badvel By Poll: బద్వేల్ ఉపఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం... పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటన..

Also Read: బద్వేలు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ.. ర్యాలీలు నిషేధం..

జనసేన కూడా దూరం 

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. తాజాగా టీడీపీ కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. 

Also Read: బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి

బరిలో నిలిచేందుకు బీజేపీ సై

కానీ బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. బీజేపీ మిత్రపక్షమైన జనసేన పోటీకి దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కడప జిల్లా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. బద్వేల్‌లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేశామని సోము వీర్రాజు తెలిపారు. స్థానికంగా ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.  బీజేపీ, జనసేన ప్రజాక్షేత్రంలో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబ రాజకీయాల్ని వ్యతిరేకిస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా కుటుంబ పాలన వ్యవస్థ విస్తరించిందని, ఏపీలో కూడా కుటుంబ పాలన సాగుతోందన్నారు. దానికి వ్యతిరేకిస్తూనే బద్వేల్ ఎన్నికల పోటీలో నిలవాలని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించామన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఉపఎన్నికలో ఎత్తి చూపుతామని సోము వీర్రాజు చెప్పారు. 

Also Read: బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు... స్పష్టం చేసిన పవన్ కల్యాణ్... అనంతపురం సభలో కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget