అన్వేషించండి

Sajjala : బాహుబలి టిక్కెట్లపై సజ్జల వ్యాఖ్యలు దేనికి సంకేతం ? ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

బాహుబలి టిక్కెట్ల అమ్మకాల లెక్కలను పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఇవి బెదిరింపులుగా కొంత మంది భావిస్తున్నారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో బాహుబలి టిక్కెట్ల వ్యవహారంపై మాట్లాడటం కొత్త చర్చకు దారి తీస్తోంది. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ పైవిమర్శలు చేసి ఆయనకు టాలీవుడ్‌లోనే మద్దతు లేదని చెప్పారు. అంత వరకూ బాగానే ఉన్నా టిక్కెట్ల అంశంపైనా స్పందించారు. ఈ క్రమంలో బాహుబలి చిత్రం గురించిన ప్రస్తావన తీసుకు వచ్చారు. బాహుబలి సినిమాకి తొలివారం 50 శాతమే టికెట్లు బుక్‌ అయినట్లు చూపారని అంటున్నారని... ఈ అంశంపై ఒకసారి చెక్‌ చేయాల్సి ఉందన్నారు. చెప్పుకొచ్చారు. ఒక వేళ  అదే నిజమైతే అంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదన్నారు. బాహుబలికి మొదటి వారంలో సగం టికెట్లే అమ్ముడైనట్టు చూపితే మోసం చేసినట్టేనని స్పష్టం చేశారు. 

Also Read : పవన్‌కు అనుకూలమా ? వ్యతిరేకమా ? . "మా" ఎన్నికల అజెండా సెట్ చేసిన మంచు విష్ణు !

అసలు ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి బాహుబలికి అసలు సంబంధమే లేదు. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట విడుదలైన సినిమా గురించి ఆ సినిమాల కలెక్షన్ల గురించి ఇప్పుడు సజ్జల వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలి మొదటి సినిమా 2015లో వచ్చింది.. రెండో భాగం 2017లో వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కనీసం పదిహేను రోజుల పాటు రిలీజైన అన్ని ధియేటర్లలోనూ హౌస్ ఫుల్ అయిందనేది బహిరంగ రహస్యం. నిజంగానే అప్పట్లో ధియేటర్ల  యజమానులు సగం టిక్కెట్లే అమ్ముడయ్యాయని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టారా.. ఆ సమాచారం సేకరించిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం కొంత మందిలో వినిపిస్తోంది. 

Also Read : బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...

ఒక వేళ నిజంగా అలా చేసి ఉంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా చూపించారన్న విషయాన్ని కూడా స్పష్టంగా కూడా చెప్పలేదు. అలా అంటున్నారని పరిశీలించాల్సి ఉందని సజ్జల అంటున్నారు. అంటే ఓ రకంగా అది బెదిరింపు అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే .. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతిస్తే అన్ని సినిమాల కలెక్షన్లు బయటకు తీస్తామన్న సంకేతాన్ని సజ్జల పంపారని అంటున్నారు. ధియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసని చెప్పడం ద్వారా ఈ హెచ్చరికను నేరుగానే పంపారని అంటున్నారు. టిక్కెట్లు ఎన్ని అమ్ముడయ్యాయో లెక్క చెప్పి జీఎస్టీ కట్టేది ధియేటర్లే. ఏదైనా తప్పు జరిగితే ధియేటర్ ఓనర్లు, లీజుకు తీసుకున్న వారే బాధ్యులవుతారు. 

Also Read : పూరీకి ఏమైంది? 8 నెలలుగా మౌనం.. బర్త్ డే విషెస్‌కు కూడా చార్మీయే రిప్లై
   
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వంతో లేని ఇబ్బంది ఏపీ ప్రభుత్వంతోనే ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. సమస్య ఏమిటో అందరికీ తెలుసు కానీ పరిష్కారం కోసం అందరూ ఒకే దారిలో పయనించే పరిస్థితి లేదు. 

Watch Video : ప్రాణాలతో చెలగాటం.. కరెంట్‌‌తో చేపలకు గాలం..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Embed widget