అన్వేషించండి

Attakc on Cm Jagan: సీఎం జగన్ పై రాయి దాడి ఘటన - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు, నిందితుడికి 14 రోజుల రిమాండ్

Andhrapradesh News: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

Remand Report On Attack On Cm Jagan: సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అతని ఫోన్ కూడా సీజ్ చేశామన్నారు. సీఎం జగన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు తెలిపారు. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం రాయితో దాడి చేసినట్లు చెప్పారు. 

రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే.?

'సీఎం జగన్ కు ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడు. డాబా కోట్ల సెంటర్ లో దాడి చేసేందుకు యత్నించాడు. వివేకానంద స్కూల్ పక్కన ఉన్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీష్ రాయితో దాడి చేశాడు. అక్కడ తోపులాట ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కేసులో ఏ2 ప్రోద్బలంతోనే సతీష్ దాడి చేశాడు.' అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.

అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు.. ఆధార్ లో తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడి ఆధార్ కార్డులో పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని.. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించారు. కాగా, దురుద్దేశపూర్వకంగానే నిందితుడు సీఎంపై రాయితో దాడి చేశాడని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సతీష్ కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, విజయవాడలో ఈ నెల 13న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర చేస్తుండగా.. సీఎం జగన్ పై సింగ్ నగర్ వద్ద రాయి దాడి జరిగింది. దీనిపై విచారించేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు.. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సతీష్ అనే యువకుడే సీఎం జగన్ పై రాయి దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. అటు, సీఎంపై రాయి దాడి ఘటన రాజకీయంగానూ హీట్ పెంచింది. ఇది ఆకతాయిల పని కాదని.. పక్కా ప్రణాళికతో చేసిందే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుండగా.. టీడీపీ నేతలు దీనిపై కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: AP Advisors Politics : రాజకీయాలు చేయాలంటే రాజీనామా చేయాల్సిందే - వైసీపీకి సలహాదారుల సమస్య !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Hyderabad News: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Telangana News: పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం - పరీక్షలు ముగిసే వరకూ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం - పరీక్షలు ముగిసే వరకూ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget