అన్వేషించండి

Minister Roja: ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ పారిపోతారు- మంత్రి రోజా హాట్ కామెంట్స్

Andhra Pradesh News: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు.

Nagari Roja News: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తప్పదని మంత్రి రోజా జోస్యం చెప్పారు. పొత్తులో భాగంగా జనసేన  24 సీట్లు తీసుకుందని, కూటమికి  జనసేనకు ప్రకటించినన్నీ సీట్లు కూడా రావని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో కనిపించరని, హైదరాబాద్‌కు పారిపోతారని ఆరోపించారు. టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించేందుకు ప్రజలు సిద్దంగా లేరని దుయ్యబట్టారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జగనన్న మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, ఆయన లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండరని విమర్శించారు. మరోసారి నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ కొడతానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని రోజా అన్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోజాకు ఇంటి పోరు

ఎన్నికల వేళ నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీలో సెగ తప్పడం లేదు. ఆమెకు టికెట్ ఇవ్వవద్దంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు తీర్మానించారు. రోజాకు టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. రాజకీయాల్లో రోజా ఐరన్ లెగ్ అని, ఆమెకు టికెట్ ఇస్తే వైసీపీకి నష్టమని విమర్శిస్తున్నారు. తమ వల్లనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని,  అయితే ఆమె నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కమిషన్లు రౌడీయిజం, భూకబ్జాలు పెరిగిపోయాయని, ఆమె లాంటి మంత్రిని ఇప్పటివరకు చూడలేదని ఐదు మండలాలకు చెందిన వైసీపీ ఇంచార్జ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. రోజా సోదరులు కూడా నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని, అవి ప్రశ్నించినందుకే తమను దూరం పెట్టారని అంటున్నారు. మంత్రి రోజాకు సీటు ఇచ్చే విషయంలో జగన్ పునరాలోచన చేయాలని కోరారు. రోజాకు టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదని, ఆమెకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

రోజాకు టికెట్ ఉంటుందా..?

నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలిచే పరిస్థితి లేదని పలు సర్వే నివేదికలు జగన్‌కు అందినట్లు చెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదనే టాక్ నడుస్తోంది. రోజాకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత కోసం జగన్ చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే నియోజకవర్గంలో బలమైన నేత ఎవరూ లేకపోవడంతో రోజాకే మరోసారి టిెకెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్‌లను మారుస్తూ అభ్యర్థులను జగన్ ఖరారు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget