అన్వేషించండి

Perni Nani Comments: అప్పుల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం.. కాకరేపుతున్న పేర్ని నాని కామెంట్స్... కేంద్రంపై వైసీపీ అటాక్

ఏపీలో కాషాయ ముఖ్యమంత్రిని తీసుకువచ్చేందుకు బీజేపీ రాజకీయం చేస్తుందన్న మంత్రి పేర్ని నాని కామెంట్స్...బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీశారు. కేంద్రం అప్పులు తేల్చండని సజ్జల ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన కామెంట్స్ తో మాటకు మాట అన్న పరిస్థితి నెలకొంది. కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా కామెంట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమయ్యిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అప్పులు చేయడంలేదా అని ప్రశ్నించిన ఆయన... ఆ రాష్ట్రాలు సొంతంగా నోట్లు ముద్రించుకుంటున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన అప్పులపై కూడా లెక్కలు బయటకు తీయాలని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ కేంద్రాన్ని నిందించలేదన్నారు. పోలవరం నిధులు వేగంగా తీసుకువచ్చి ఈ క్రెడిట్‌ అంతా బీజేపీ తన ఖాతాల్లో వేసుకోవచ్చని సజ్జల అన్నారు. 

బీజేపీ నేతలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. నిన్న కేబినేట్ భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి పేర్నినాని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కాషాయదళంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓ మతతత్వ పార్టీ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదోరకంగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తుందని అంజాద్ బాషా ఘాటు విమర్శలు చేశారు.  ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటైన కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సంకేతాలు ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

ఏపీలో కాషాయ సీఎం తీసుకువచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాసిన అవసరం తమకు లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్​ సునీల్ దేవధర్ ట్వీట్ పెట్టారు. ఆ ఆలోచన కూడా తమ పార్టీకి లేదన్నారు.  జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న భయంతో ఆ పార్టీ నేతలు అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలే వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సినంత అవసరం తమకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసమే తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సమాజసేవే ప్రథమ లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందన్నారు.

Also Read: BJP YCP Fight: రాబోయే రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ కలకలం...

 
 

 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget