అన్వేషించండి

AP HighCourt : పేదల ఇళ్ల నిర్మాణాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్లు !

పేదల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. పిటిషనర్లు ... తమ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు మార్గం సుగమం అయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పేదలందరికీ ఇళ్ల పథకానికి న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి.  అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలని.. లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. గతంలోనే అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇళ్ల పట్టా కోసం 3 వారాల్లో వినతిపత్రం అందించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వినతిపత్రం ఇచ్చిన 3 నెలల్లో జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది.  దీంతో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోయాయి. 

Also Read : ఏపీకి వరద సాయం చేయండి... రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల విజ్ఞప్తి !

తెనాలికి చెందిన కొంత మంది  పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున స్థలం పేదలకు కేటాయించడం, మహిళలకు మాత్రమే ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి సెంటు, సెంటున్నర స్థలం ఇంటినిర్మాణానికి ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నిస్తూ దీనిపై విచారణ నిర్వహించాలని ఆదేశించారు.  అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులన్నింటినీ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. విచారణలో పిటిషనర్లే వెనక్కి తగ్గారు. 

Also Read : వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?

ప్రభుత్వం 30 లక్షల మందికిపైగా సెంటు సంస్థలను పంపిణీ చేసినట్లుగా ప్రకటించింది. వాటిలో ఇళ్ల నిర్మాణాలకు తొలి విడతగా శంకుస్థాపనలు కూడా చేశారు. కొంత మంది పునాదుల వేసుకున్నారు. చేపట్టిన ఇళ్ల నిర్మాణాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు రావడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. చివరికి కాస్త లేటయినా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది., దీంతో ప్రభుత్వం ఇక ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనుంది. 

Also Read : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు విద్యాదీవెన నిధులు...10 రోజుల్లోగా కాలేజీలకు కట్టాలని సీఎం జగన్ సూచన !

ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. పిటిషనర్లు మీ పార్టీ వారంటే.. మీ పార్టీ వారని ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేయలేక ఇలా నాటకాలు ఆడుతోందని విపక్షాలు విమర్శించారు. ఇప్పుడు మొత్తం క్లియర్ అయినట్లయింది. ఇక ప్రభుత్వం వేగంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. 

Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget