అన్వేషించండి

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు!

AP Government: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేయనుంది.

AP Government: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణాన్ని కాలుష్యం చేసే వారే అందుకు శిక్ష అనుభవించాలని తెలిపింది. ఈ క్రమంలోనే భారీగా జరిమానాలు విధించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిథిన్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు.. ఈ కామర్స్ కంపెనీలపైన దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వినియోగంపై పట్టమ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేసింది. 

25 వేల రూపాయల నుంచి 50 వేల వరకు జరిమానా...

నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై తొలిసారి తప్పుగా పరిగణిస్తే... రూ.50 వేలు, రెండోసారి లక్ష రూపాయలు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. దీంతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కిలోకు పది రూపాయల చొప్పున జరిమానా వేయనున్నారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే.... 2500 రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. దుకాణాలు, సంస్థలు, మాల్స్ తదితర ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే.. 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.  

నెల రోజుల క్రితం ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలుపై వాయిదా

ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధాన్ని వాయిదా వేసింది. నిషేధం అమలుచేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. తయారీ సామగ్రి, టెక్నాలజీ మార్చుకోవాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులను ఆదేశించారు. తయారీ సామగ్రి కోసం  రూ.20 లక్షల వరకు రుణం అందించాలని సూచించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల రద్దును జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబరు 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
Andhra Pradesh Top News: పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
PRC ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
AP Zilla Parishads: ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు
ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Embed widget