AP Plastic Flex Ban : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం, నవంబర్ 1 నుంచి అమల్లోకి!
AP Plastic Flex Ban : ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

AP Plastic Flex Ban : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తామని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. ఇటీవల విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తామన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమల్లోకి తీసుకోస్తామని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఉత్తర్వులు అతిక్రమిస్తే చర్యలు
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, తయారీ, రవాణా, ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంలో నగరాలు, పట్టణాల్లో ఈ నిషేధం అమలుకు పూర్తి అధికారులు బాధ్యత వహించాలని రాష్ట్ర గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీవోలో వెల్లడించింది. నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్లాస్టిక్కు బదులుగా కాటన్, నేత వస్త్రాలు వినియోగించాలని పేర్కొంది.
NTR: ఇలా చేస్తే YSR స్థాయి పెరగదు - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందన
2027 కల్లా ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ
ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్ వెల్లడించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ని ఏపీలో తొలి అడుగుగా సీఎం జగన్ చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
Also Read : APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరా నాటికి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు!
Also Read : CM Jagan Review : డిసెంబర్ నాటికి లబ్దిదారులకు ఇళ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడొద్దు - సీఎం జగన్
Before You Go
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















