అన్వేషించండి

APNGOs Fire : ఒకటో తేదీనే జీతాలివ్వాలి - బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కుతామని ఏపీ సర్కార్‌కు ఉద్యోగుల హెచ్చరిక !

ఒకటో తేదీనే జీతాలివ్వకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేశారు. తాము దాచుకున్న సొమ్మును ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


APNGOs Fire  :   ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు.  పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పై  ఉద్యోగుల సంఘం నేతలు సమావేశం అయ్యారు. జనవరి 15 ప్రభుత్వం కు డెడ్ లైన్ ఇచ్చారు.అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేస్తామని ప్రకటించారు. విజయవాడలో ఎపీ జేఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని నాయకులు ఆవేదన వెలిబుచ్చారు.  

బకాయిలు అడగకూడదనే జీతాలు ఆలస్యం చేస్తున్నారన్న ఉద్యోగ నేతలు 

ఏపీజేఏసీ అమరావతి మూడో మహా సభ కర్నూలు లో ఫిబ్రవరి ఐదో తేదీన జరుపుతామని..వేలాదిగా ఉద్యోగులు అంతా తరలి రావాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.  ఉద్యోగుల సమస్యలు పై సమావేశంలో వాడివేడిగా చర్చ సాగిందని.. మాకు రావాల్సిన వేల‌కోట్లు రూపాయలు ఇవ్వక‌పోగా..ప్రతి నెలా భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వడం లేదన్నారు.రెండేళ్లు పాటు భరించాం..‌ప్రభుత్వానికి ఇది ఒక అలవాటు గా మారిందని ఫైర్ అయ్యారు. జీతాలు, పెన్షన్ లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జీత, భత్యాల‌ కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారన్నారు.  బకాయిలు అడగకూడదనే... జీతాలు ఆలస్యం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు.

సీఎం హామీ ఇచ్చినా బకాయిలు ఇవ్వడం లేదన్న బొప్పరాజు 

మేము దాచి పెట్టుకున్న డబ్బులు కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఆ డబ్బులు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. పదవీ విరమణ చేసిన రోజే బెన్ ఫిట్స్ ఇచ్చి పంపాలని నిబంధన ఉందని, అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో రిటైర్ అయిన ఉద్యోగులు మధన పడుతున్నారని వివరించారు.రిటైర్ అవ్వాలంటే ఉద్యోగులు భయపడుతయన్నారన్నారు.  ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.అధికారి తన జేబులో డబ్బు ఇస్తున్నారని, ఉద్యోగులు, పెన్షనర్ల వద్ద డబ్బు కట్ చేసి వెనక్కి తీసుకున్నారని తెలిపారు. సిఎం తో చర్చల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.

జీతాలు ఒకటో తేదీనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ 
 
తమకు రావాల్సిన బకాయిల పై గతలో ఉద్యోగులంతా ఛలో విజయవాడ ఉద్యమాన్ని నిర్వహించారని,ఆ తరువాత కూడా చెల్లింపులో పురోగతి లేదన్నారు. సీపీఎస్ రద్దు, ఉద్యోగాలు పర్మినెంట్, జీత భత్యాల చెల్లింపు అన్నారని,స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు.తమ డబ్బు తిరిగి ఇస్తారా లేదా..కష్టపడి పని చేసినా జీతం ఇవ్వకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి తామంతా సహకరిస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బకాయిలు చెల్లింపు, ఒకటో తేదీన జీత భత్యాల పై సిఎం సమావేశం నిర్వాహించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.ఉద్యోగ సంఘాలు తో చర్చ చేసి హామీ ఇవ్వాలని,అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం హామీ ఇవ్వలేక పోతుందన్నారు.సిఎం స్వయంగా వీటి పై స్పందించాలని కోరుతున్నామన్నారు.

సంక్రాంతి తరువాత ఉద్యమం..! 

ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోతే, సంక్రాంతి తరువాత ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతామని హెచ్చరించారు.సిపియస్ పై పదే పదే చర్చ ల పేరుతో ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు.ఓపియస్, సిపియస్ రెండే దేశంలో ఉన్నాయని,వీటి పై సమావేశం పేరుతో మమ్మలని ఎందుకు ఇబ్బంది పెడతారో అర్దం కావటం లేదని మండిపడ్డారు.ఆరు రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేశారని తెలిపారు.తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో రద్దు, సిక్కిం కూడా కమిటీ వేసిందని వివరించారు.ఇక చర్చలతో పని లేదు... మేము వెళ్లేది లేదని స్పష్టంచేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget