అన్వేషించండి

AP CMRF Scam : ఏపీ సీఎం నిధిని కొల్లగొట్టింది వాళ్లేనా ? ఏసీబీ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను కొల్లగొట్టిందెవరు ? ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరులు, యాభై మంది ఉద్యోగులపై ఏసీబీ కన్ను


ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల గోల్ మాల్ వ్యవహారం అంతకంతకూ పెద్దదవుతోంది. యాబై మంది ఉద్యోగుల పాత్రతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధుల  పీఏలు, ఇతరులు కలిసి సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ. 117 కోట్లను ఇలా గల్లంతు చేశారని గుర్తించిన ఏసీబీ చాలా కాలంగా విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. అప్పట్నుంచి విచారమ జరుపుతున్నారు. కొంత మంది ఉద్యోగుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొందరిపై తాజాగా అధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఏపీలు, వారి అనుచరులు ఉద్యోగులతో కుమ్మక్కయి స్వాహా చేసినట్లుగా చెబుతున్నారు. వారెవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.Also Read : వాళ్లిద్దరు ఎవరు ? వివేకా హత్య కేసులో టీవీ చానళ్లకు సీబీఐ నోటీసులు !

సీఎంఆర్ఎఫ్ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు వినియోగించే నిధి. ఆరోగ్యశ్రీతో సేవలు పొందలేని రోగాలు.. ఇతర అసాధారణమైన నష్టాల వల్ల రోడ్డున పడ్డకుటుంబాలు.. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం నేరుగా సాయంచేసేందుకు ఈ ఫండ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.  ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే సీఎంఆర్ఎఫ్‌కే ఇస్తారు. కరోనా పరిస్థితుల కారణంగా విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు కూడా విరాళాలు సీఎంఆర్ఎఫ్‌కు జమ చేశారు. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల వారీగా నిధులు సమీకరించి సీఎంఆర్ఎఫ్‌కు ఇచ్చారు.  ఇటీవల ఏపీ సర్కార్ ఉచిత వ్యాక్సిన్లను పంపిణీ చేయాలనుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున విరాళాలు కోరారు. అయితే ఆ తర్వాత కేంద్రం ఉచితంగా పంపిణీ చేసింది.   Also Read : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ

గత ఏడాది సెప్టెంబర్‌లో  సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న మూడు చెక్కులు.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు ఎస్‌బీఐ బ్రాంచీల్లో జమ అయ్యాయి. మూడు కలిపి రూ. 117 కోట్లు సొమ్ము తమ ఖాతాలకు మళ్లించుకోవాలనుకున్నారు. అది పెద్ద మొత్తం కావడంతో ఆయా బ్రాంచ్‌ల అధికారులు.. ఇక్కడ వెలగపూడి బ్రాంచ్ అధికారులను సంప్రదించారు. వారు చెక్కులు జారీ చేసిన అధికారులను సంప్రదించారు. అవి నకిలీ చెక్కులని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: TTD High Court : 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

అప్పుడే సీఎంఆర్ఎఫ్ విషయంలో విచారణ ప్రారంభమయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఇలాంటి ఫేక్ చెక్కులతో కొన్ని నిధులు డ్రా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఉద్యోగి నారాయణ కాలేజీ మాజీ ఉద్యోగి అని.. అతని అక్రమాలతో తనకు సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రకటించారు. అప్పటి నుంచి ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. యాభై మంది ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పీఏలు అని చెబుతున్నారు కానీ వారెవరన్నదానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget