అన్వేషించండి

Cm Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు అమలు చేశామని కామెంట్స్

మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. బటన్ నొక్కి అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు.

అగ్రవర్ణ పేద మహిళల సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌  వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయసున్న 3,92,674 మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి సీఎం జమ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ పాలన చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, క్షత్రియ, వెలమతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.

Also Read: నేడే మహిళల ఖాతాల్లో నగదు జమ... ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

అక్కచెల్లెమ్మలకు మేలు చేసేలా 

మహిళల ఆర్థిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పాటుపడుతోందని సీఎం జగన్ అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలను గత ప్రభుత్వం మోసం చేసిందన్న సీఎం ఆరోపించారు. ఆసరా పథకంతో డ్వాక్రా రుణాలను అందిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 5–10 లక్షల రూపాయల మేలు జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రూ.2 లక్షల పైగా ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు తెలిపారు. జగనన్న విద్యాదీవెనతో పిల్లల చదువులకు ఖర్చు అయ్యే ఫీజులను వారి ఖాతాల్లోనే వేస్తున్నామన్నారు. 

రాజకీయంగా గుర్తింపు

మహిళలకు రాజకీయంగా కూడా ప్రాముఖ్యత ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. శాసనమండలిలో తొలి మహిళా వైస్‌ ఛైర్మన్‌గా జకియా ఖాన్‌ ను నియమించామన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రి సుచరితమ్మ ఉన్నారన్నారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్‌ సెక్రటరీగా నీలం సాహ్నిని పెట్టామని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు 51 శాతం కేటామన్న సీఎం...ఇందుకోసం చట్టం చేశామని చెప్పుకొచ్చారు. 

Also Read: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
Embed widget