అన్వేషించండి

YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

నేతన్న నేస్తం మూడో విడత సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానన్న సీఎం జగన్...ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతల కష్టాల్ని తీర్చేందుకు సంకల్పించామన్నారు.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికులకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. నేతన్న నేస్తం మూడో విడత కింద 80 వేల 32 మంది ఖాతాలల్లో రూ. 192 కోట్లు జమచేస్తున్నారు. అర్హులైన నేతన్నలు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేలు అందించనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపింది. మూడో విడత ఆర్థిక సాయంతో కలిపి మొత్తంగా రూ. 576 కోట్లు లబ్ధిదారులకు అందించినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్థిక సాయం కింద నేతన్నల అకౌంట్లలో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని సీఎం జగన్ అన్నారు. 

సుమారు 80 వేల మంది లబ్దిదారులకు రూ. 192.08 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీ చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తన పాదయాత్రలో చేనేత కష్టాలను చూశానని సీఎం అన్నారు. 


YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.48 వేలు సాయం అందించారు. తాజాగా మూడో విడత ఆర్థిక సాయాన్ని  అర్హుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు. మూడో విడతతో కలిపి అర్హులైన ప్రతీ నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందజేసింది. ఇవాళ మూడో విడత కింద రూ.192.08 కోట్లు నేతన్నలకు అందిస్తు్న్నారు. 

నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులపై వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచుతారు. ఒకవేళ అర్హులకు ఈ పథకం ద్వారా సాయం అందకపోతే వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులైతే సాయం తక్షణమే అందేలా చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు తమ పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP DesamLSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Abhishek Sharma : అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- హైదరాబాద్‌ ఆటగాడి ముందు రికార్డులు దాసోహం
అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- హైదరాబాద్‌ ఆటగాడి ముందు రికార్డులు దాసోహం
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Arjun Son Of Vyjayanthi Trailer: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
Embed widget