అన్వేషించండి

CM Chandrababu: 'అవినీతి, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు' - వర్షంలోనే సీఎం చంద్రబాబు ప్రసంగం, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేత

Andhrapradesh News: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజావేదిక నిర్వహించారు.

CM Chandrababu Comments: గత ఐదేళ్ల పాలనలో అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira) మండలం గుండుమలలో (Gundumala) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్ డబ్బులు అందించారు. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకున్న సీఎం.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత, స్థానిక టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు. అనంతరం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. వర్షంలోనే ఆయన తన ప్రసంగం కొనసాగించారు.

'మేం పాలకులం కాదు సేవకులం'

తాము పాలకులం కాదని.. సేవకులం అని ప్రజలు గుర్తించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో పరదాలు, చెట్లు నరకడాలు, బారికేడ్లు ఉండవని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 'వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే దోచుకున్నారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేసుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటాను. అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తాం. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుంది. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. కరువు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనేది ఉండదు. అనంత జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తాం. ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. పేదలకు ఇంటి నిర్మాణానికి బాధ్యత తీసుకుంటాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 96 శాతం పూర్తైంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సత్యసాయి జిల్లా గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికది వెళ్లి పింఛన్ అందించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 96 శాతం పంపిణీ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లా పెన్షన్ల పంపిణీ జరిగినట్లు చెప్పారు.

 

Also Read: CM Chandrababu: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి, సుప్రీం తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Embed widget