అన్వేషించండి

CM Chandrababu: 'అవినీతి, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు' - వర్షంలోనే సీఎం చంద్రబాబు ప్రసంగం, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేత

Andhrapradesh News: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజావేదిక నిర్వహించారు.

CM Chandrababu Comments: గత ఐదేళ్ల పాలనలో అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira) మండలం గుండుమలలో (Gundumala) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్ డబ్బులు అందించారు. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకున్న సీఎం.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత, స్థానిక టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు. అనంతరం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. వర్షంలోనే ఆయన తన ప్రసంగం కొనసాగించారు.

'మేం పాలకులం కాదు సేవకులం'

తాము పాలకులం కాదని.. సేవకులం అని ప్రజలు గుర్తించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో పరదాలు, చెట్లు నరకడాలు, బారికేడ్లు ఉండవని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 'వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే దోచుకున్నారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేసుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటాను. అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తాం. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుంది. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. కరువు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనేది ఉండదు. అనంత జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తాం. ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. పేదలకు ఇంటి నిర్మాణానికి బాధ్యత తీసుకుంటాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 96 శాతం పూర్తైంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సత్యసాయి జిల్లా గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికది వెళ్లి పింఛన్ అందించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 96 శాతం పంపిణీ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లా పెన్షన్ల పంపిణీ జరిగినట్లు చెప్పారు.

 

Also Read: CM Chandrababu: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి, సుప్రీం తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Chandra Babu On Ravan: రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget