అన్వేషించండి

జగనే సమస్య అయినప్పుడు ఆ కార్యక్రమం ప్రయోజనం ఏంటీ?: బీజేపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన తీరుపై సత్యకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని తీసుకురావడంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. జగనే సమస్య అయినప్పుడు సమస్య ఎవరికి చెప్పుకోవాలని సటైర్లు వేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో ప్రయోజనం ఉండే పరిస్థితులు లేవన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన తీరుపై సత్యకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని తీసుకురావడంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్‌కు డయల్ చేస్తే, జగన్ చెప్పే అబద్ధాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయని సత్యకుమార్ తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, సమస్యల పరిష్కారం ఉత్తిమాటేనని విమర్శించారు. జగనే అసలు సమస్య అయినప్పుడు జగనన్నకు చెబుదాం అనేది అర్థరహితమని అన్నారు.

ఛార్జ్ షీట్ ఉద్యమానికి పకడ్బందీ ఏర్పాట్లు...
ఛార్జిషీట్‌ల ఉద్యమానికి మైక్రోలెవల్ అభ్జర్వేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు అన్నారు. 5000వేల శక్తి కేంద్రాల్లో బిజెపి నేతల పర్యటనలు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్థాయిలో అభియోగాల నమోదుకు భారతీయ జనతాపార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయని ఆయన చెప్పారు. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరణలో బిజెపి నాయకత్వం తలమునకలై ఉందన్నారు. 

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్‌ల కార్యక్రమంలో వేగం పెంచిందని, అందుకు అనుగుణమైన మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ పెంచామని తెలిపారు సోమువీర్రాజు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఉద్యమాన్ని తీవ్రం చేశామన్నారు.  ఆయా జిల్లాల నాయకత్వాని, అసెంబ్లీ స్థాయి నాయకత్వానికి పని విభజన చేసినట్టు వివరించారు. గ్రామాల వారీగా అభియోగాల స్వీకరణకు ప్రజల వద్దకు నేరుగా వెళుతున్నారని చెప్పారు. 

శక్తి కేంద్రాల ఏర్పాటు..
శక్తి కేంద్రాలు అంటే నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బిజెపి పార్టీ కార్యక్రమం రూపొందించుకుంది. అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బిజెపి నేతలు పర్యటనలు నిర్వహించారు. విజయవాడ వన్ టౌన్ లో బిజెపి శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. శానిటేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులు కూడా బిజెపి నాయకత్వానికి వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయల సీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారు. అరసవల్లిలో కేంద్రం నిధులను దారి మళ్లించిన సంఘనలు ఉన్నాయని బిజెపి నేతలు ప్రకటించారు. నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపీ నేతలు అవినీతి చిట్టా బిజెపి నేతలకు అందిందని చెప్పారు. భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పై భారతీయ జనతా పార్టీ నాయకులు అభియోగాలు నమోదు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయశాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం భారతీయ జనతా పార్టీ నేతలు దృష్టికి తీసుకుని వచ్చాయి. రాయల సీమలో అన్నమయ్య డ్యాంకు సంబంధించిన సమస్య పై ఇప్పటికే బిజెపి కోర్టులో కేసు వేసింది. అదేవిధంగా బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యల పై బిజెపి నేతలు అభియోగాలు నమోదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget