అన్వేషించండి

AP BJP On Davos Row : దావోస్ టూర్స్‌కి వెళ్లి ఏం సాధించారో బయట పెట్టండి ? టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలకు ఏపీ బీజేపీ సవాల్ !

గత ఎనిమిదేళ్లుగా ఏపీ నుంచి దావోస్ పర్యటనలకు వెళ్లిన వివరాలు, వచ్చిన పెట్టుబడులు బయటపెట్టాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. నిజాయితీ నిరూపించుకోవాలని.. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.

 

AP BJP On Davos Row :  ఆంధ్రప్రదేశ్‌లో దావోస్ పెట్టుబడుల అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దావోస్ నుంచి ఆహ్వానం రాలేదని.. ఏపీ ప్రభుత్వానికి సిగ్గు చేటని.. టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఆహ్వానం వచ్చిందని.. గతంలో చంద్రబాబే దావోస్ కు వెళ్లి  పెట్టుబడులు ఏమీ తీసుకు రాలేదని ఆరోపణలను మంత్రి అమర్నాథ్ చేశారు. ఈ వివాదంపై ఏపీ బీజేపీ స్పందించింది. రెండు పార్టీలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలను గుర్తు చేసిన  ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.  2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి కూడా కార్యరూపం ఏపీ లో దాల్చలేదు అని మీరే అంటున్నారు?వాస్తవం మీ రెండు పార్టీలు ప్రజలు ముందు ఉంచి వైకాపా , తెదేపా పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి  నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ చీఫ్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతీ ఏడాది ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లేవారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని ప్రకటించేవారు. అయితే పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ నుంచి టీడీపీ హయాంలో ఎలాంటి పెట్టుబడులు తేలేదని ప్రకటించారు.  దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన.. మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు 
 
ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని  జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కార్య దీక్ష, పట్టుదల  చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ముందే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. 

ఇలా రెండు పార్టీల నేతల మధ్య వివాదం ఏర్పడటంతో.. ఏపీ బీజేపీ స్పందించింది.  రెండు పార్టీలు కలిసి.. దావోస్ యాత్రలకు వెళ్లినప్పుడు.. ఏం సాధించారో చెప్పాలని డి్మాండ్ చేస్తోంది.  *అది విహార యాత్ర, లేక ఒప్పందాల యాత్రనా ? ఏంటి ఈ దావోస్ వాస్తవం ? అని ప్రశ్నించారు.  2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి  నిజాయితీని నిరూపించుకోమని సవాల్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై రెండు పార్టీలు స్పందిస్తాయా ? అని ఏపీ బీజేపీ ప్రశ్నిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Airbus Software Issue: అప్పటివరకూ ఎయిర్‌బస్ ఏ319, ఏ320, ఇతర విమానాలు నడపవద్దు- డీజీసీఏ.. పూర్తి జాబితా చూశారా
అప్పటివరకూ ఎయిర్‌బస్ ఏ319, ఏ320, ఇతర విమానాలు నడపవద్దు- డీజీసీఏ
Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Advertisement

వీడియోలు

I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Airbus Software Issue: అప్పటివరకూ ఎయిర్‌బస్ ఏ319, ఏ320, ఇతర విమానాలు నడపవద్దు- డీజీసీఏ.. పూర్తి జాబితా చూశారా
అప్పటివరకూ ఎయిర్‌బస్ ఏ319, ఏ320, ఇతర విమానాలు నడపవద్దు- డీజీసీఏ
Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telugu TV Movies Today: ఈ ఆదివారం (నవంబర్ 30) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (నవంబర్ 30) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే - డోంట్ మిస్
IELTS Free Coaching: విద్యార్థులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్‌లో IELTS ఫ్రీ కోచింగ్
విద్యార్థులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్‌లో IELTS ఫ్రీ కోచింగ్
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Embed widget