అన్వేషించండి

AP Assembly Session: రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు వైసీపీ రెడీ

సెప్టెంబర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఏసీ నిర్ణయాల అమలులో కీలకంగా వ్యవహరించేలా పెద్దిరెడ్డి, జోగి రమేష్ లకు బాధ్యతలు అప్పగించారు

రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది ప్రభుత్వం. మూడు రాజధానులపై బిల్లు ప్రవేశ పెడతారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నెల 15 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 15 న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఎన్ని బిల్లులు ప్రవేశ పెడతారు అనే చర్చ బీఏసీ లో జరుగుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి, జోగిరమేష్ లకి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఏసీ నిర్ణయాల అమలులో కీలకంగా వ్యవహరించేలా పెద్దిరెడ్డి, జోగి రమేష్ లకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. బీఏసీ వ్యవహారాల కో ఆర్డినేటర్ గా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తారు. సభలో జరిగే వ్యవహారాలు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా బాధ్యతలు ఈ ఇద్దరు మంత్రులు నిర్వహిస్తారు. 
చంద్రబాబు సభకు హాజరు అవుతారా !
ప్రతిప‌క్ష నేత చంద్రబాబు గత కొన్ని రోజలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ కి హాజరు కానున్నారు. సీఎం జగన్ మంత్రులకు క్లాస్ తీసుకోవడంతో అసెంబ్లీలో మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది మంత్రులకు శాఖలపై పట్టులేదని సాక్షాత్తు సీఎం జగన్ చెప్పడంతో మంత్రులు హోమ్ వర్క్ మొదలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో త‌మ సత్తా చూపేందుకు మంత్రులు రెడీ అవుతున్నారు. ఈ సారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అది మంత్రులకు జగన్ క్లాస్ తీసుకోవడం... సీఎంగా త‌న‌కు ఉన్న అధికారాలు, బాధ్యత‌లు, మంత్రుల ప‌ని తీరుపై ఉన్న రిపోర్ట్ ఆదారంగా జ‌గ‌న్ వ్యవ‌హ‌రించినట్లు తెలుస్తోంది. 
మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్..
అవసరం అయితే మంత్రి పదవుల నుంచి తొలగిస్తా అని వార్నింగ్ ఇచ్చారు జగన్. దీంతో మంత్రులు అసెంబ్లీకి ప్రిపేర్ అయి వస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు అసెంబ్లీలో కొద్దిమంది మంత్రులు మాత్రమే చూపించారు. కొంతమంది అసలు హాజరు అయ్యేవారు కూడా కాదు. కానీ సడెన్ గా జగన్ మంత్రుల ప‌ని తీరుపై దృష్టి పెట్టటంతో పాటు, ప‌దవులు హూష్టింగ్ అవుతాయ‌ని హెచ్చరించ‌టంతో మంత్రుల్లో టెన్షన్ మొదలయింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతి ఎమ్మెల్యే, మంత్రి అలెర్ట్ అవుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సీఎం క్లాస్ తో మంత్రులు అలెర్ట్ కాదు, ఏకంగా హోమ్ వర్క్ చేసే పరిస్థితి వచ్చింది. 
వైసీపీలో నియోజక వర్గాల వారీగా పరిశీలకులు రానున్నారా..
పార్టీ పటిష్టతపై వైసీపీ అధిష్టానం మరింత దృష్టి పెట్టిందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పార్టీకి నియోజకవర్గాల అబ్జర్వర్లు ను నియమించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ అధినేత సీఎం జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లని నియమించనుంది వైసీపీ. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులను నియమించి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఎమ్మెల్యే పనితీరు, సంక్షేమ పథకాల అమలు ఇలాంటి విషయాలన్నీ పరిశీలిస్తారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ పరిస్థితులపై అధిష్టానానికి పరిశీలకులు నివేదికలు అందిస్తారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో అబ్జర్వర్లు నియామకం జరుగుతుంది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వైసీపీ పరిశీలకులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న రోజుల్లోనే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget