అన్వేషించండి

AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Assembly Speaker Ayyanna Patrudu | అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Ap Assembly Session | అమరావతి: అసెంబ్లీకి రాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకుంటున్నారని, వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చాలా దేశాల్లో రీ కాల్ విధానం ఉందని, తాను లక్నో లో చేసిన రీ కాల్ వ్యాఖ్యలు మళ్లీ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ఆలస్యంగా ప్రారంభం కావడానికి గల కారణాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు. సభ ఆలస్యానికి కారణం కోరం లేకపోవడం కాదని, కేవలం సాఫ్ట్‌వేర్, టెక్నికల్ సమస్యల వల్లే జాప్యం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. సభ్యులు చాలా మంది సమయానికే వచ్చారని, అయితే వైసీపీ నేతలు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో రాజకీయాలు ముఖాముఖిగా ఉండేవని, కానీ ఇప్పుడు వెనుక ఉండి గుంతలు తవ్వే సంస్కృతి పెరిగిందని అసహనం వ్యక్తం చేశారు.

ఆ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే నిర్ణయం
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ అన్నారు. సభ్యులు సభకు రావడమే కాకుండా, లోపల ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు కూర్చున్నారో కూడా ఈ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా నమోదవుతుందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కేవలం జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగం చేయకుండా జీతాలు తీసుకుంటే ఎవరూ ఊరుకోరని, మరి అసెంబ్లీకి రాకుండా ప్రజా ధనాన్ని జీతాల రూపంలో ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

ఈ సమస్యపై గతంలో లక్నోలో జరిగిన స్పీకర్ల సమావేశంలో కూడా తాను మాట్లాడానని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. విధులకు రాని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించే రికాల్ (Recall) విధానం చాలా దేశాల్లో ఉందని, మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పార్లమెంటుకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. విశాఖపట్నం సభలో తాను ఈ విషయం చెప్పినప్పుడు 80 శాతం మంది ప్రజలు ఏకీభవించారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అసెంబ్లీలో నిర్వహించిన చిన్న పిల్లల 'మాక్ అసెంబ్లీ' గురించి స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఆ పిల్లలే అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. ఇప్పుడు అసెంబ్లీని సందర్శించడానికి పాఠశాలల నుండి సుమారు 200 దరఖాస్తులు వచ్చాయని, రాయలసీమ నుండి విశాఖ వరకు అన్ని ప్రాంతాల విద్యార్థులు అసెంబ్లీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget