అన్వేషించండి

CM Jagan On Jangareddigudem : 54 వేల జనాభాలో 90 మంది మరణించడం సహజమే-జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎ జగన్

CM Jagan On Jangareddigudem : జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని, టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.

CM Jagan On Jangareddigudem : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని(Normal Deaths) సీఎం జగన్(CM Jagan) ను అన్నారు. శాసనసభలో జంగారెడ్డిగూడెం మరణాలపై మాట్లాడిన సీఎం...జంగారెడ్డిగూడెం జనాభా యాభైవేలకు పైగా ఉంటుందన్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడక్కడా జరిగిన మరణాల సంఖ్య  రెండు శాతం అనుకున్నా కనీసం తొంభైమంది సహజంగా చనిపోతారన్నారు. అలాంటిది ఇలా కేవలం సహజ మరణాలను కూడా వక్రీకరించి టీడీపీ(TDP) రాద్దాంతం చేస్తుందని సీఎం జగన్ అన్నారు. కల్తీ మద్యం చేసేవాళ్లను ఎందుకు సపోర్ట్ చేస్తామని సీఎం అన్నారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో జరిగినట్లే ఇప్పుడు అక్కడక్కడా నాటుసారా సమస్య ఉందని సీఎం అన్నారు. అందుకే ప్రత్యేక పోలీసు ఫోర్స్ తీసుకొచ్చామన్నారు. కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమన్నారు. 

పర్మిట్ రూమ్ లు రద్దు

రాష్ట్రంలో లిక్కర్ వినియోగం తగ్గించాలని ఆలోచిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 43 వేల బెల్ట్ షాపులు లేకుండా చేశామన్నారు. నాలుగు వేల మూడువందల నలభై  పర్మిట్ రూమ్‌లు రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో లాభాపేక్షతో మద్యం(Liquor) విచ్చల విడిగా అమ్మించేవాళ్లని సీఎం ఆరోపించారు. ఇప్పుడు లాభాపేక్ష లేకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోందన్నారు. లిమిటెడ్‌ అవర్స్‌లో దొరికే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. షాక్‌ కొట్టేలా ధరలతో లిక్కర్ వినియోగం తగ్గిందన్నారు. 

అక్రమ మద్యం తయారీదారులపై కేసులు

"ప్రతిపక్షాలు, పోలీసులు, ఇతర సంస్థల సూచనతో అక్రమ మద్యం తగ్గించేందుకు రేట్లు ఇటీవల తగ్గించాం. గత ప్రభుత్వం అమ్మే రేట్లకు మద్యం తీసుకొచ్చాం. కల్తీ మద్యం తయారుదారులను రక్షించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సహజమరణాలను కూడా మద్యం తాగి చనిపోయినట్టు చెప్పడం బాధ కలిస్తోంది. కల్తీ, అక్రమ మద్యం తయారీదారులపై 13,000 కేసులు నమోదు చేశాం." అని సీఎం జగన్ అన్నారు. 

మంత్రి ఆళ్ల నాని వివరణ 

జంగారెడ్డిగూడెంలో మరణాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందన్నారు. నలుగురు చనిపోతే 18 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సహజ మరణాలపై కూడా టీడీపీ అపోహలు సృష్టిస్తోందన్నారు. టీడీపీ డ్రామాలకు కొన్ని పత్రికలు వంత పాడుతున్నాయన్నారు. బాధితుడు మరణించిందని మద్యం వల్లకాదు గుండెనొప్పితో అని మృతుడి భార్యే స్వయంగా ప్రకటిందన్నారు. టీడీపీ సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget