అన్వేషించండి

Assembly Live Updates: సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై వేటు

AP Assembly: తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా తెలంగాణలో ఈ నెల 8 నుంతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

LIVE

Key Events
Assembly Live Updates: సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై వేటు

Background

AP Assembly Sessions: ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం నుంచి రాజ‌కీయాలు మ‌రో రూపును సంత‌రించుకోనున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం జరగనుంది. కాగా, ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. ఇక, తెలంగాణలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వ‌ర‌కు బ‌హిరంగ వేదిక‌ల‌పై.. విమ‌ర్శ‌లు గుప్పించుకున్న ప్ర‌భుత్వ, ప్ర‌తిప‌క్ష పార్టీలు.. అసెంబ్లీల వేదిక‌గా తమ వాణి వినిపించనున్నాయి. తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌లు, ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు పైచేయి సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న నేప‌థ్యంలో ఈ స‌భా వేదిక‌గా.. తమ త‌మ వ్యూహాల‌ను ర‌క్తికట్టించ‌నున్నాయ‌ని తెలుస్తోంది. 

10:45 AM (IST)  •  06 Feb 2024

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్సన్ వేటు

ఉదయం నుంచి స్పీకర పోడియం వద్ద ఉంటూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మరింత రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నినాదాలు చేశారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

09:30 AM (IST)  •  06 Feb 2024

అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం- టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

తీవ్ర గందరగోళం మధ్యే అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించింది అధికార పార్టీ. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. వాటిపైనే చర్చ జరగాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ టైంలో పేపర్లు చించి విసరడంపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:19 AM (IST)  •  05 Feb 2024

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్‌

గవర్నర్‌తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని టీడీపీ ఆరోపించింది. అందుకే సభ నుంచి టీడీపీ వాకౌట్‌ చేసింది. 

11:07 AM (IST)  •  05 Feb 2024

సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి: గవర్నర్

సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తున్న తమ ప్రభుత్వం ఇప్పటివరకూ 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్నార. తమది పేదల ప్రభుత్వమని... ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామన్నారు. మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చామన్నారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

11:05 AM (IST)  •  05 Feb 2024

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌: గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన మార్చేశామన్నారు గవర్నర్. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామన్నారు. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చన్నారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గించామన్నారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని... 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రసంగంలో వివరించారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైందన్నారు గవర్నర్. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget