అన్వేషించండి

CM Jagan: 'మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట' - సాధికారత చేతల్లో చూపించామన్న సీఎం జగన్

Vijayawada News: గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. విజయవాడలో అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan Comments on Minorities: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. విజయవాడలో (Vijayawada) పర్యటిస్తున్న ఆయన, మైనారిటీస్ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి (Abul Kalamazad Jayanthi) ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనారిటీలను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను తమ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. పేద ముస్లింలందరికీ దివంగత నేత వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని వివరించారు.

'చేతల్లో చేసి చూపించాం'

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. 'అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారతను మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించాం. మైనారిటీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. గత ప్రభుత్వం హయాంలో ఇంత సంక్షేమం జరగలేదు.' అని సీఎం జగన్ వివరించారు.

అన్ని పదవుల్లో అవకాశం

'నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నలుగురు మైనారిటీలకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాం. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఓ మైనారిటీ మహిళకు అవకాశం కల్పించాం. ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చేలా ఏకంగా చట్టమే చేశాం. ఉర్దూను రెండో అధికార భాషగా చేశాం. హజ్ యాత్రకు విజయవాడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం రావాలని చర్యలు తీసుకున్నాం. దీని కోసం రూ.14 కోట్ల భారం పడినా వెనుకడుగు వేయలేదు.' అని సీఎం జగన్ వివరించారు.

Also Read: Housesites to Journalists in Andhrapradesh: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు - మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget