అన్వేషించండి

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 1179, తెలంగాణలో 244 కరోనా కేసులు... బులెటిన్లు విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖలు

ఏపీలో కొత్తగా 1179 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 244 కొత్త కేసులు వచ్చాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు తాజాగా కోవిడ్ బులెటిన్లు విడుదల చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,737 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో 1,179 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,40,708 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ వల్ల 11 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,089కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,651 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,12,714కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 క్రియాశీలక కేసులున్నాయి. ఇప్పటివరకు 2,78,13,498 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

Also Read: Pfizer Vaccine Clinical Trial: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు భేష్.. ఫైజర్ ప్రకటన

తెలంగాణలో కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 244 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,63,906కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,907కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 296 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,55,061కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 184 రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల్లో ఇవే అత్యల్పం కావడం విశేషం. కొత్తగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,35,04,534కి చేరింది. దేశంలో నిన్న ఒక్క రోజే కోవిడ్ బారిన పడిన వారిలో 34,469 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,27,49,574కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కారణంగా 252 మంది మరణించారు. దీంతో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,45,385కి పెరిగింది.

Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు

క్రియాశీల కేసులు తగ్గుముఖం

దేశంలో ఈరోజు నమోదైన కోవిడ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 3,09,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.75 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 0.92 శాతానికి తగ్గింది. కేరళలో నిన్న ఒక్క రోజే 15,692 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Also Read: India Covid Cases: దేశంలో తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. 184 రోజుల్లో ఇదే అత్యల్పం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Latest News:పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
Men Saving Societies In Andhra Pradesh:పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Mastan Sai Lavanya Case : మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్‌- సంచలన విషయాలతో రిమాండ్‌ రిపోర్టు 
మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్‌- సంచలన విషయాలతో రిమాండ్‌ రిపోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mangli Ram Mohan Naidu Issue | కేంద్రమంత్రి రామ్మోహన్ పై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు | ABP DesamPM Modi Maha Kumbh 2025 | మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ | ABP DesamNaga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Latest News:పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
Men Saving Societies In Andhra Pradesh:పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Mastan Sai Lavanya Case : మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్‌- సంచలన విషయాలతో రిమాండ్‌ రిపోర్టు 
మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్‌- సంచలన విషయాలతో రిమాండ్‌ రిపోర్టు 
Ind Vs Eng 1st Odi: నేడే తొలి వన్డే.. నూతనోత్సాహంలో భారత్, బరిలోకి దిగ్గజ ప్లేయర్లు రోహిత్, విరాట్, మెగాటోర్నీకి ముందు సన్నాహకంగా..
నేడే తొలి వన్డే.. నూతనోత్సాహంలో భారత్, బరిలోకి దిగ్గజ ప్లేయర్లు రోహిత్, విరాట్, మెగాటోర్నీకి ముందు సన్నాహకంగా..
Indian Illegal Migrants Sent Back From US: గొలుసులతో బంధించి పంపేశారు!- అక్రమ వలసదారులపై అమెరికా అమానవీయ చర్య 
గొలుసులతో బంధించి పంపేశారు!- అక్రమ వలసదారులపై అమెరికా అమానవీయ చర్య 
School Holidays: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గుడ్ న్యూస్‌- 26, 27 తేదీల్లో స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గుడ్ న్యూస్‌- 26, 27 తేదీల్లో స్కూళ్లకు సెలవులు
SSMB 29: రాజమౌళి, మహేశ్ బాబు కొత్త సినిమా - హాలీవుడ్ రేంజ్ మూవీలో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్, ఆ న్యూస్‌లో నిజమెంత?
రాజమౌళి, మహేశ్ బాబు కొత్త సినిమా - హాలీవుడ్ రేంజ్ మూవీలో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్, ఆ న్యూస్‌లో నిజమెంత?
Embed widget