![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
![AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్ AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/87bc1517583e7ce24345e1e14c544f4e_original.jpg)
Background
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎగ్జిబిషన్ సోసైటీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తా: హరీశ్ రావు
ఎగ్జిబిషన్ సోసైటీ మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామని అన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని అన్నారు.
కిషన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్లోని అంబర్పేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్ పేటకు చాలా రోజుల తర్వాత వచ్చానని అన్నారు. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే అందుకు కారణం అంబర్పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. అంబర్పేటకు దూరమయ్యానన్న బాధ మాత్రం ఉందని అన్నారు. గతంలో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
కరీంనగర్లో అరుదైన ప్రసవం
కరీంనగర్ జిల్లాలో అరుదైన ప్రసవం జరిగింది. నిఖిత అనే గర్భిణీ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం నలుగురు పిల్లలు సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పిల్లల బరువు తక్కువగా ఉండటంతో డాక్టర్లు ఇంక్యుబెటర్లో పెట్టారు. గతంలో నిఖిత సోదరి లిఖితకు కూడా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. లిఖిత, నిఖిత కూడా కవలలు కావడం విశేషం.
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు
ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావును తాము ఎన్నుకున్నట్లుగా ఎగ్జిబిషన్ సోసైటీ మేనేజ్మెంట్ కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పుకున్నందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళదామని అన్నారు.
దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్
తెలంగాణలో దళితులకు సమ న్యాయం కల్పించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా దళితులు ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అలాంటప్పుడు మంత్రి వర్గంలో ఒకే ఒక దళిత మంత్రికి చోటు కల్పించారని విమర్శించారు. కరోనా వల్ల దళిత బంధు ఆపేశారన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా అర్వింద్ తప్పు బట్టారు. కరోనా కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారని, దళిత బంధు ఇచ్చేందుకు అది ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)