అన్వేషించండి

AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

Background

ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

16:04 PM (IST)  •  21 Aug 2021

ఎగ్జిబిషన్ సోసైటీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తా: హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామని అన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని అన్నారు.


15:52 PM (IST)  •  21 Aug 2021

కిషన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్ పేటకు చాలా రోజుల తర్వాత వచ్చానని అన్నారు. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్‌ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే అందుకు కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ మాత్రం ఉందని అన్నారు. గతంలో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

15:47 PM (IST)  •  21 Aug 2021

కరీంనగర్‌లో అరుదైన ప్రసవం

కరీంనగర్ జిల్లాలో అరుదైన ప్రసవం జరిగింది. నిఖిత అనే గర్భిణీ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం నలుగురు పిల్లలు సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పిల్లల బరువు తక్కువగా ఉండటంతో డాక్టర్లు ఇంక్యుబెటర్‌లో పెట్టారు. గతంలో నిఖిత సోదరి లిఖితకు కూడా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. లిఖిత, నిఖిత కూడా కవలలు కావడం విశేషం.

15:43 PM (IST)  •  21 Aug 2021

ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావును తాము ఎన్నుకున్నట్లుగా ఎగ్జిబిషన్ సోసైటీ  మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పుకున్నందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళదామని అన్నారు.

13:38 PM (IST)  •  21 Aug 2021

దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

తెలంగాణలో దళితులకు సమ న్యాయం కల్పించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా దళితులు ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అలాంటప్పుడు మంత్రి వర్గంలో ఒకే ఒక దళిత మంత్రికి చోటు కల్పించారని విమర్శించారు. కరోనా వల్ల దళిత బంధు ఆపేశారన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా అర్వింద్ తప్పు బట్టారు. కరోనా కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారని, దళిత బంధు ఇచ్చేందుకు అది ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించారు.

13:13 PM (IST)  •  21 Aug 2021

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్

గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్ ఏటీ అగ్రహారంలో 10వ తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.  దీంతో బాలిక తల్లిదండ్రులు దిశ  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కానిస్టేబుల్ రమేశ్‌ను సస్పెండ్ చేశారు. 

13:08 PM (IST)  •  21 Aug 2021

కాబుల్ ఎయిర్ పోర్టులో భారతీయుల కిడ్నాప్!

అఫ్గానిస్థాన్​ కాబుల్‌ ఎయిర్ పోర్టులో పలువురిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తరలింపునకు సిద్ధంగా ఉన్నవారిని అపహరించినట్లు అఫ్గాన్​ మీడియా సంస్థలు ప్రకటించాయి. ఇందులో 150 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే అఫ్గాన్ మీడియా కథనాలను తాలిబన్​ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్​ఖండించారు. భారతీయులను కిడ్నాప్ చేయలేదని తెలిపింది. 

12:08 PM (IST)  •  21 Aug 2021

స్థానిక సంస్థలకు నిధుల విడుదల

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదలయ్యాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు మొత్తం కలిపి రూ.432.49 కోట్ల విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్ల విడుదల చేశారు. మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్ల వచ్చాయి. నిధులు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

11:18 AM (IST)  •  21 Aug 2021

కేంద్ర మంత్రి సిగ్గులేకుండా మాట్లాతున్నారు.. ఎర్రబెల్లి కౌంటర్

భువనగిరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ.. కేంద్రానికి కట్టే పన్నుల్లో సగం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉండి మీరేం చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. మీరేదో చేసినట్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు మాట్లాడుతుంటే తామేం మాట్లాడాలని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలు కూడా నెరవేర్చలేదని.. పైగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

11:13 AM (IST)  •  21 Aug 2021

టూరిజం స్పాట్లుగా ఆ ప్రదేశాలు: కిషన్ రెడ్డి

దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
Embed widget