అన్వేషించండి

Sajjala On OTS: ఉద్యోగులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదు... ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం... సజ్జల కామెంట్స్

ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పడకుండా ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంతం చేయడంలేదన్నారు.

ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంత పెట్టలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్ ను ఉచితంగా ఇవ్వాలని కొందరు ప్రశ్నిస్తున్నారని, వీళ్లంతా గత ప్రభుత్వం హయాంలో ఏమయ్యారన్నారు. శుక్రవారం అమరావతిలో మాట్లాడిన సజ్జల... ఓటీఎస్ పై వివరణ ఇచ్చారు. రుణాలు కట్టలేక పిల్లలకు ఇవ్వలేకపోతున్న కారణంగా ఈ సమస్యకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.  ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందించే పథకం ఓటీఎస్ అన్నారు. దీనిలో ఎలాంటి దాపరికంలేదన్నారు. కానీ ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఓటీఎస్‌లో ఇతర ఛార్జీలు ఏంలేవన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ తో ప్రభుత్వానికి వచ్చే రూ. 6 వేల కోట్లు రావని సజ్జల వెల్లడించారు. 

Also Read: పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు.

ఓటీఎస్ పై ఎవరిని బలవంత పెట్టలేదు

ఓటీఎస్‌పై ఎవరినీ బలవంత పెట్టలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తిగా స్వచ్చందమన్నారు. ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్‌ వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రజలపై రిజిస్ట్రేషన్‌ భారం పడకూడదనే ఓటీఎస్ తీసుకొచ్చామన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం పడుతోందన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్‌ చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదలకు ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. 

Also Read:  ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాజకీయ ప్రకటనలు సరికాదు

ఉద్యోగ సంఘాల హామీలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పరిశీలిస్తున్నామన్నారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం కమిటీలు వేశామన్నారు. నెలరోజుల్లో కమిటీలు నివేదికలు ఇస్తాయని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. ఉద్యోగులు సంయమనం పాటించాలన్నారు. ఇలాంటి ప్రకటనలతో ఉద్యోగులకే నష్టమన్నారు. వారంలోపే పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని సజ్జల తెలిపారు.

Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !

Also Read:  కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.