అన్వేషించండి

CM Jagan Reddy : సీఎం జగన్ పెద్ద మనసు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సాయం

CM Jagan Reddy : సీఎం జగన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి తక్షణ సాయం అందిచాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan Reddy : కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ సాయం అందించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుని కాపాడాలని సీఎంను ఓ తల్లి వేడుకుంది.  దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే బాలుడి వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాలుడి వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని కన్నీటిపర్యంతమైన ఆ తల్లికి హామీ ఇచ్చారు జగన్. ఈ ఘటన నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో జరిగింది.

చిన్నారికి సాయం 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ సీఎం జగన్ ను కలిసి, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది. కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎం జగన్ ను అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 

ఏవీ ధర్మారెడ్డి కుటుంబానికి పరామర్శ

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కుమారుడు బుధవారం ( డిసెంబర్ 21) గుండెపోటుతో మరణించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లారు. అక్కడ ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ధర్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి రెండో సంతానమైన చిన్నారికి అంతుచిక్కని వ్యాధి సోకి అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రుల్లో సంప్రదించి చికిత్స అందించారు. కానీ నయం కాలేదు. కానీ ఆ వ్యాధి నయం కావాలంటే కోటి రూపాయలపైగా అవుతుందని వైద్యలు తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి‌ కుటుంబం అయోమయం స్థితిలో పడింది. తమకు ఎవరు సాయం చేస్తారో తెలియని స్థితిలో తెలిసిన వారందనీ సాయం అడిగారు. కానీ అంత మొత్తంలో డబ్బును ఎవరూ సమకూర్చలేకపోయారు. జులై నెలలో సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో సీఎంను కలిసేందుకు దంపతులిద్దరూ సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు. ఆ దంపతులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో సీఎం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్సకు హామీ ఇచ్చిన జగన్, ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.  దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన ఓఎస్డీ ప్రత్యేక చొరవ చూపి చిన్నారి వైద్యానికి అయ్యే నగదును విడుదల చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget