అన్వేషించండి

Cyclone Ditva alert: శ్రీలంకలో వందల మందిని బలి తీసుకున్న తుపాన్ దిత్వా - ఏపీలోని అలజడి రేపేందుకు రెడీ - ఇవిగో జాగ్రత్తలు

Ditwah: దిత్వా తుపాన్ ప్రభావం ఏపీపైనా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.. రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Cyclone Ditva:  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ (Ditwah) తుఫాను ప్రస్తుతం శ్రీలంక తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. కారైక్కల్ నుంచి 220 కి.మీ., పుదుచ్చేరి నుంచి 330 కి.మీ., చెన్నై నుంచి 430 కి.మీ. దూరంలో ఉంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

ఈ తుఫాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
 మంగళవారం వరకు ఒక్క మత్స్యకారుడు కూడా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.  రైతుల వరిపొలాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడకముందే పంట కోత, ఎండబెట్టడం, సురక్షిత స్థలాలకు తరలించడం లాంటి చర్యలు వేగవంతం చేయాలన్నారు.  విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) & RTGS ద్వారా SMSల ద్వారా ప్రజలు, రైతులకు అప్రమత్త సందేశాలు పంపాలి. కూలిన ఇళ్లలో ఉంటున్న వారిని ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే రిలీఫ్ క్యాంపులకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి. గాలులకు చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రోడ్లపై ట్రాఫిక్ అడ్డంకులు రాకుండా చూడాలని సూచించారు.  విద్యుత్ సరఫరా తెగిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంటి దగ్గరే ఉండేలా అప్రమత్తం చేయాలి. బలమైన గాలులు వీస్తున్నప్పుడు చెట్లు, హోర్డింగ్స్ దగ్గరకు వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చారు.   

దిత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా, సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది. 

‘దిత్వా’ తుఫాను శ్రీలంక తీరాన్ని తాకడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు, మట్టిబొడ్లు సంభవించాయి. మొత్తం 123 మంది మరణించగా, 130 మంది మిస్సింగ్‌గా ఉన్నారు. 25 జిల్లాల్లో 63 వేల కుటుంబాలు (2 లక్షల మంది) ప్రభావితమయ్యారు. ఈ తుఫాను శ్రీలంకకు 2017 తర్వాత అతి తీవ్ర విపత్తుగా మారింది. తుఫాను ఇప్పుడు భారత తీరం వైపు కదులుతోంది, కానీ శ్రీలంకలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి తుఫాను శ్రీలంకను వదిలి భారత తమిళనాడు వైపు కదులుతున్నా, దాని పరోక్ష ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం దిత్వా ప్రభావం  ఇండియాపై కనిపిస్తోంది.              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Embed widget