By: ABP Desam | Updated at : 12 Apr 2022 02:59 PM (IST)
ఆర్థిక సాయం చెక్కును అందిస్తున్న పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కైలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆయన ఇటీవల చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 12) ఉదయం నుంచి ఆయన బాధిత కుటుంబాలను కలుస్తూ చెక్కులను అందజేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ఆయన భార్య నాగలక్ష్మికి అందజేశారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన తండ్రి 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడని.. పంటనష్టం, చేసిన అప్పులు తీర్చలేక అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడని రామకృష్ణ కుమారుడు మహేష్ ఆవేదన చెందాడు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య మల్లికకు అందజేశారు.
ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ధర్మవరంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు pic.twitter.com/4pJCJCFOR6
— JanaSena Party (@JanaSenaParty) April 12, 2022
కొత్త చెరువులో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు.
అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పరామర్శించారు. pic.twitter.com/Mp0aNeGTHL
— JanaSena Party (@JanaSenaParty) April 12, 2022
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!