అన్వేషించండి

Anantapur: కరువు సీమలో కాసులు కురిపిస్తున్న సోదరులు.. వ్యవసాయం ద్వారా ఏడాదికి కోట్లు సంపాదన

సేద్యం చేయలేక పొలాలను అమ్ముకుని నగరాల బాట పట్టే కరువు సీమ అనంతపురం జిల్లాలో అధునాతనమైన వ్యవసాయం చేస్తూ దూసుకెళ్తున్న అన్నదమ్ములపై ప్రత్యేక కథనం.

అనంతపురం జిల్లా పేరు వింటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కరువు . ఇక్కడి రైతులను కదిలిస్తే కష్టాలు, కన్నీళ్లు కనిపిస్తాయి. పంట వేసిన నాటి నుంచి వర్షపు చుక్క కోసం ఆకాశాన్ని చూస్తూ ఉన్న రైతులను జిల్లాల్లో దాదాపు ప్రతి ప్రాంతంలో చూడొచ్చు. సేద్యం చేయలేక పొలాలను అమ్ముకుని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల బాట పట్టే రైతులు ఉన్నారు. అయితే కఠిన వాతావరణ పరిస్థితుల్లో తమ తెలివితో, ఆధునిక పద్ధతులలో జిల్లాకు చెందిన సోదరులు వ్యవసాయం చేసి కోట్ల రూపాయల వరకు పొందుతున్నారు. అధునాతనమైన వ్యవసాయం చేస్తూ దూసుకెళ్తున్న అన్నదమ్ములపై ప్రత్యేక కథనం. 

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకట్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన ముగ్గురు సోదరులు వ్యవసాయరంగంలో అద్భుతాలు చేస్తూన్నారు. ఇతర రైతులకు భిన్నంగా పంటను పండించి, భారీగా లాభాలు గడిస్తూ జిల్లా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరువు సీమలో కాసులు కురిపించేలా వ్యవసాయం చేసి స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో రాజశేఖర్ రెడ్డి సోదరులు మేటిగా ఎదుగుతున్నారు. 

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రాజశేఖర్ రెడ్డి తన అన్నకు, తమ్ముడికి సూచనలు ఇస్తూ వ్యవసాయం చేస్తూ దూసుకుపోతున్నారు . సంప్రదాయ వంటలకు దూరంగా ఉంటూ హార్టికల్చర్ వైపు అడుగులు వేశారు. దానిమ్మ , చీనీ,  మునగ,  బీరకాయ వంటి పంటలు సాగు చేస్తూ దిగుబడులను అధిక స్థాయిలో పొందుతున్నారు. పంటలను మార్కెట్ రేటుకు అనుగుణంగా హైదరాబాద్,  బెంగళూరు,  చెన్నై , కోయంబత్తూర్, దిండిగల్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. తాను సూచనలు ఇస్తాను కానీ తన సోదరులు సరైన సమయంలో మొక్కలకు అందించాల్సిన ఎరువులు, కీటక సంహారాలను పిచికారి చేస్తూ దిగుబడి రావడానికి ఎనలేని కృషి చేస్తారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం

 ఏ మాసాలలో మొక్కలను నాటాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని తనను ఆశ్రయించిన రైతులకు సలహాలు ఇస్తూ తోటి రైతుల పట్ల ఈ సోదరులు ఉదార స్వభావాన్ని చూపుతున్నారు. తమ తండ్రి  పదిహేను ఎకరాల పొలాన్ని తమకు వారసత్వంగా ఇచ్చారని, ప్రస్తుతం తాము 120 ఎకరాలు సంపాదించగలిగామని వెల్లడించారు. నాగపూర్‌లోరి ఎన్ఆర్‌సీసీ నుంచి సైతం ఉత్తమ జాతీయ అవార్డుతో పాటు జిల్లాకు  సంబంధించి నాలుగు ఆదర్శ రైతుల అవార్డులు ఈ సోదరులను వరించాయి. పొలంలో దాదాపు ఆరు ఎకరాలలో కొలనులు తవ్వించి నీటిని నిల్వ చేసారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తూ నీటి విలువను చెప్పకనే చెబుతున్నారు. వ్యవసాయం ద్వారా వార్షికాదాయం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 
Also Read: Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి.. వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget